టీటీడీకి భారీ విరాళాన్ని అందజేసిన విశాఖ వ్యాపారి
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధర్యంలో నడుస్తోన్న శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్ట్ కు భారీ విరాళం అందింది. విశాఖపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారి యార్లగడ్డ సూర్యారావు స్వామివారికి 1.01 కోట్ల రూపాయల విరాళాన్ని అందజేశారు.
ఈ మొత్తంతో కూడిన చెక్కును ఆయన గురువారం ఉదయం టీటీడీ ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తోన్న దేవీ ఫిషరీష్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యార్లగడ్డ సూర్యారావు తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఈ ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం తిరుమల ఆలయ ప్రాంగణంలో ఉన్న రంగనాయకుల మండపం వద్ద కోటి 10 వేల రూపాయల మొత్తంతో కూడిన చెక్కును ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఈ విరాళాన్ని శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్ట్ కు వినియోగిస్తామని ధర్మారెడ్డి తెలిపారు. అనంతరం- అర్చకులు సూర్యారావుకు స్వామివారి శాలువ, తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులు శ్రీవేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్ట్ కు కోటి రూపాయలకు పైగా విరాళాన్ని అందజేయడం నెలరోజుల వ్యవధిలో ఇది రెండోసారి. ఇదివరకు అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రుడొకరు స్వామివారికి కోటి రూపాయలకు పైగా మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications