నిన్నిలా చూడలేం.. కూతురుతో కలిసి భర్త బలవన్మరణం.. ఎక్కడ అంటే..
విజయవాడలో విషాద ఘటన జరిగింది. శ్రీనగర్ కాలనీలో ఇదివరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన సూసైడ్ చేసుకున్నాడు. అతనితోపాటు 10 ఏళ్ల కూతురు కూడా బలవన్మరణం చేసుకున్నది. భార్య అనారోగ్యంతో ఉండటంతో.. జీవించలేనని అతను సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.సమాచారం అందుకున్న పోలీసులు ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. కేసును విచారిస్తున్నారు.
కిడ్నీ వ్యాధితో భార్య బాధపడుతోంది. దానిని ఆయన చూడలేకపోయాడు. ఇక లాభం లేదనుకొని.. చనిపోతున్నానని భర్త జగాని రవి సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తన అవయవాలతోపాటు కూతురి అవయవాలను తన భార్య భరణికి ఇవ్వాలని ఆత్మహత్య లేఖ రాశాడు. గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన రవి అనంతరం ఆ ఉద్యోగాన్ని మానేశానని తెలిపారు. కొంతకాలంగా అతని భార్య కిడ్నీ సంబంధిత వ్యాధితో భార్య బాధపడుతుంది. ఆమెను అలా చూడలేకపోయాడు.
Recommended Video
కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులూ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రామకృష్ణాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.