తిరుగుబోతు బ్రహ్మచర్యంపై పుస్తకం రాసినట్టుగా నిమ్మగడ్డ లేఖ : మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు
పదవీ విరమణ చివరి రోజున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలసంస్కరణలు అంటూ గవర్నర్ కు లేఖ రాయడంపై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవిలో ఉన్నన్ని రోజులు చంద్రబాబు మేలుకోసం మెప్పు కోసం పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉద్యోగం ఊడిపోయే చివరిరోజున శ్రీరంగనీతులు చెబుతున్నారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.

నిష్పక్షపాతం, పారదర్శకం వంటి పదాలను వాడడం చూస్తుంటే నవ్వొస్తుంది
నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు చేసిన సిఫార్సులను చూస్తే తిరుగుబాటు బ్రహ్మచర్యం గురించి పుస్తకం రాశాడు అన్న సామెత గుర్తుకు వస్తోందని పేర్ని నాని తీవ్రపదజాలంతో ద్వజమెత్తారు. ఇక లేఖ ఉపోద్ఘాతంలో ఎన్నికలపై నిమ్మగడ్డ నిష్పక్షపాతం, పారదర్శకం వంటి పదాలను వాడడం చూస్తుంటే నవ్వు వస్తుందని పేర్ని నాని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఉంటూ గుంటూరులో ఓటు హక్కు కావాలనడం లోనే ఆయన వైఖరి అర్థమవుతుందని పేర్కొన్న పేర్ని నాని అసలు ఎన్నికల నిబంధనల పట్ల నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు గౌరవం లేదని విమర్శించారు.

బరితెగించి హోటల్ కెళ్ళి సుజనాచౌదరిని, కామినేనిని కలిసి నిమ్మగడ్డ రాజకీయం
2016 నుండి ఇప్పటివరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు కోసమే పని చేశారని చంద్రబాబు రక్షణే ధ్యేయంగా రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరించిందని విమర్శించారు. అంతేకాదు ఎన్నికల కమిషన్ అంటే రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. పట్టపగలు బరితెగించి హోటల్ కెళ్ళి సుజనాచౌదరి ని, కామినేని శ్రీనివాస్ ని కలిసి గంటల కొద్దీ రాజకీయ మంత్రాంగం యంత్రాంగం నడిపిన ఏకైక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని మండిపడ్డారు.

ఓటుతో చంద్రబాబుకు , నిమ్మగడ్డకు దిమ్మతిరిగేలా ప్రజలు చేశారు
ఓటుతో చంద్రబాబుకు , నిమ్మగడ్డకు దిమ్మతిరిగేలా ప్రజలు చేశారని మంత్రి పేర్ని నాని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో నిమ్మగడ్డ చంద్రబాబు కోసం పని చేసినప్పటికీ, చంద్రబాబును ప్రజలు భూస్థాపితం చేస్తారని మంత్రి పేర్ని నాని తెలిపారు.
చంద్రబాబు కోసం నాడు కరోనా సాకుతో ఎన్నికలను రద్దుచేసి, ఇక చంద్రబాబు కోసమే కరోనా కేసులు పెరుగుతుంటే కూడా , కోర్టుకెళ్ళి మరీ ఎన్నికలను ఇప్పుడు నిర్వహించిన ఘనుడు నిమ్మగడ్డ అని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు .

పదవీ విరమణ రోజు నిమ్మగడ్డ శ్రీరంగ నీతులు
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే చంద్రబాబుకు నష్టం జరుగుతుందని, సంవత్సరం తర్వాత ప్రభుత్వం పై వ్యతిరేకత వస్తే అది చంద్రబాబుకు లాభిస్తుందని భావించి, ఆ విధంగా ఎన్నికలను నిర్వహించారని చంద్రబాబు సూచనల మేరకే ఎన్నికలను వాయిదా వేసింది నిజం కాదా అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పదవీ విరమణ చివరి రోజున శ్రీరంగనీతులు చెప్తే ఎవరు నమ్ముతారు అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి పేర్ని నాని.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications