Pushpa Srivani: వీడియో: థింసా నృత్యం అదుర్స్: డప్పు కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే
విజయనగరం: ప్రపంచ ఆదివాసిీ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. విజయనగరం జిల్లా పార్వతిపురంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు అధికారులు. విజయనగరం జిల్లాకే చెందిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి.. స్వయంగా ఈ శాఖను పర్యవేక్షిస్తోన్నందున పార్వతిపురంలో నిర్వహించిన ఆదివాసి దినోత్సవ వేడుకలకు ప్రాధాన్యత ఏర్పడింది.
పార్వతిపురంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఆదివాసి ఉత్సవాలకు పుష్ప శ్రీవాణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు అలజంగి జోగారావు,కలెక్టర్ సూర్యకుమారి, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన గిరిజన సాంస్కృతిక కార్యక్రమాల్లో గిరిజన మహిళలతో కలిసి పుష్ప శ్రీవాణి కూడా నృత్యం చేశారు. గిరిజన మహిళలతో కలిసి పుష్ప శ్రీవాణి డప్పుల శబ్దానికి అనుగుణంగా థింసా నృత్యం చేఃశారు. కలెక్టర్ సూర్యకుమారి కూడా వారితో పాదం కలిపారు. పార్వతిపురం శాసనసభ్యుడు అలజంగి జోగారావు డప్పు కొట్టారు.
ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా గిరిజనులతో కలిసి నృత్యం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం @PushpaSreevani #worldtribalday #WorldTribalDay2021 #pushpasrivani pic.twitter.com/wDL0m7RDjN
— oneindiatelugu (@oneindiatelugu) August 9, 2021
మరోవంక- ఆదివాసీల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. పోలవరం, బాక్సైట్ తవ్వకాల అంశాలను ఆయన ప్రస్తావిస్తూ అధికార పార్టీపై పలు ఆరోపణాస్త్రాలను సంధించారు. రాష్ట్రానికి వెన్నెముకగా భావించే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో చాలామంది ఆదివాసీలు ఉన్నారని, వారిని వైసీపీ ప్రభుత్వం దగా చేస్తోందని ధ్వజమెత్తారు.
ఇళ్లను ఖాళీ చేయించే విషయంలో ఆదివాసీలను వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా వేధింపులకు గురి చేస్తోందని మండిపడ్డారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తూ నిలువ నీడలేకుండా చేస్తోందని ఆరోపించారు. అటు విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తోందని వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని విమర్శించారు. గిరిజనుల భవితవ్యాన్ని కాలరాస్తోందంటూ మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాల విషయంలో గిరిజన సంఘాలు ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులు, ఫిర్యాదులను పట్టించుకోవట్లేదని విమర్శించారు.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వద్దన్నా వైసీపీ మైనింగ్ మాఫియా చేస్తోన్న దోపిడీ ఆగట్లేదని అన్నారు. రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం, అభ్యున్నతి కోసం తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఏ ఒక్క పథకం కూడా ఇప్పుడు అమలులో లేదని చంద్రబాబు అన్నారు. గిరిజన రిజర్వేషన్ల జీవో-3 రద్దు పై ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించట్లేదని చెప్పారు. ఇప్పటికైనా విశాఖపట్నం మన్యంలో మైనింగ్ అక్రమాలను నిలిపివేయడానికి, స్తంభించిపోయిన గిరిజన సంక్షేమ పథకాలను పునరుద్ధరించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications