తెలంగాణకుటిడియఫ్ పునరంకితం
తెలంగాణకుజరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణప్రజలకు తెలియజేసేందుకుపునరంకితం అవుతామని అమెరికాలోనితెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్(టిడియఫ్) అధ్యక్షుడు మధు రెడ్డికాకులవరం అన్నారు. నవంబర్ 1వతేదీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినంసందర్భంగా ఆయన ఒక ప్రకటనవిడుదల చేశారు. తెలంగాణఅభివృద్ధిపట్ల, సాగునీటి రంగంలోతెలంగాణకు జరుగతున్న అన్యాయంపట్ల, జలాలు, ఉద్యోగాలు, వనరులు కొల్లగొట్టడంపట్ల ఆయన ఈ సందర్భంగా తీవ్రనిరసన వ్యక్తం చేశారు. తెలంగాణఎజెండాను ముందుకు తెలంగాణఅభివృద్ధికి ఉన్న మార్గమని ఆయనఅన్నారు.
తెలంగాణవనరుల దోపిడీని ఆపడానికి కృషిచేయాలని ఆయన తెలుగుదేశం,తెలంగాణ రాష్ట్ర సమితి, బిజెపి, టిఆర్సిసిసి, కమ్యూనిస్టు పార్టీల తెలంగాణనాయకులకు విజ్ఞప్తి చేశారు.పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్సామర్థ్యం పెంచుతూ 170 జీవోను జారీచేయడం తెలంగాణకు ద్రోహంచేయడమేనని ఆయన విమర్శించారు.అన్ని ట్రిబ్యునళ్లను ఉల్లంఘిస్తూ నీటికొల్లగొడుతున్నారని ఆయన అన్నారు.పోలవరం ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలోనికోయలకు అన్యాయం చేయడాన్ని ఆయనవ్యతిరేకించారు.