వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారైల మోడల్‌ స్కూల్‌ ప్రాజెక్టు

By Staff
|
Google Oneindia TeluguNews

జిల్లాలో విద్యాప్రమాణాలను పెంచడానికి పాలమూరు ఎన్నారై ఫోరం మహబూబ్‌నగర్‌ జిల్లాలో మోడల్‌ స్కూల్‌ ప్రాజెక్టును చేపట్టింది. ప్రాజెక్టు ఇన్‌చార్జి రవి మేరెడ్డి సమన్వయంలో జిల్లా కలెక్టర్‌ ఉషా రాణి ఈ నెల 12వ తేదీన ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్‌ సావిత్రి ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. స్థానికంగా రామ్‌ బరిగెల్లా ప్రాజెక్టును పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. మరో వైపు విద్యార్థులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి మోటివేషన్‌, ఇన్సెంటివ్‌లు కల్పిస్తారు. స్పాన్సర్‌ చేసే పాఠశాలకు ఈ ప్రాజెక్టు అమలుకు 500 డాలర్లు ఖర్చవుతుందని అంచనా. ఈ విద్యాసంవత్సరంలో ఈ ప్రాజెక్టును 50 పాఠశాలల్లో అమలు చేయాలనేది పాలమూరు ఎన్నారై ఫోరం లక్ష్యం. విద్యాసంవత్సరాంతంలో పాలమూరు ఎన్నారై ఫోరమ్‌ మహబూబ్‌నగర్‌లో సత్కారోవత్సవాన్ని నిర్వహిస్తుందని విజయ్‌ చావా చెప్పారు. పరీక్షా ఫలితాల సాధనలోనే గాక ఇతర కార్యక్రమాల్లో కూడా విద్యార్థులు ముందంజ వేయడానికి, సంపూర్ణ అక్షరాస్యతకు, డ్రాప్‌ అవుట్స్‌ను మూడేళ్లలో పూర్తిగా తగ్గించడానికి, తదితర లక్ష్యాల సాధనకు కృషి జరుగుతుంది. ప్రస్తుత విద్యావిధానానికి రక్తమాంసాలను అందించడానికి తమ వంతు కృషి చేస్తామని విజయ్‌ చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X