వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాస నిర్ణయానికి ఎన్నారైల స్వాగతం

By Staff
|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు కె. చంద్రశేఖరరావు, ఎ. నరేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయడాన్ని తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం (టిడియఫ్‌) స్వాగతించింది. ఈ సందర్భంగా తెలంగాణ సాధనకు సంబంధించి అమెరికాలోని టిడియఫ్‌ కో ఆర్డినేటర్‌ మధు కె. రెడ్డితో పాటు కార్యవర్గ సభ్యులు మూడు విషయాలను ప్రస్తావించారు. తెరాస నాయకత్వం ఇకపై తమతో కలిసి వచ్చే శక్తులన్నింటితో ఒక్క తాటిపై నిలిచి తెలంగాణ వ్యతిరేకులు వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా ప్రజల, మేధావుల మద్దతుతో ఉద్యమించాలని సూచించారు. తెలంగాణ ప్రజల ఓపికను పరీక్షిస్తున్న కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం ఇకనైనా మేలుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ గులాబీ కండువా కప్పుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేసి కమిట్‌ అయిన సంగతి ఓటర్లు మరిచిపోరనే విషయాన్ని గుర్తించాలని వారన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు సొంత వ్యక్తిత్వంతో తమను ఎన్నుకున్న తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను కోరి బహిరంగ ప్రకటన చేయాలని వారు డిమాండ్‌ చేశారు. పోరాటంలో తామెవ్వరికీ తీసిపోమని, చారిత్రక క్రమంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిచేయటానికి ప్రత్యేక రాష్ట్రమే మార్గమని నిర్ద్వంద్వంగా చాటాలని వారు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను డిమాండ్‌ చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులుగా ఢిల్లీలో వాళ్లిచ్చిన విజ్ఞప్తులు నీటి మూటలు కావని నిరూపించుకోవాలని వారన్నారు. టిఆర్‌సిసిసి నాయకత్వం కార్యోన్ముఖం కావాలని వారు డిమాండ్‌ చేశారు. తెలంగాణలో అట్టడుగున నలుగుతున్న సామాన్యుల బతుకులకు అద్దం పట్టాల్సిన కమ్యూనిస్టులు వాళ్ల భాషా ఫాసిజాన్ని వదిలిపెట్టి నూతన తెలంగాణ ఆవిష్కరణలో భాగం కావాలని కూడా వారు డిమాండ్‌ చేశారు. ఎవరో కొద్ది మంది జాతీయ నాయకులుగా చెలామణి అవుతున్న రాష్ట్ర కమ్యూనిస్టు నాయకుల కబంధ హస్తాలను తెలంగాణ కమ్యూనిస్టులు, ప్రజలు గుర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X