ఆస్టిన్ లో దీపావళి వేడుకలు
ఆస్టిన్ నగరం లో ని తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో 2008 దీపావళి సంబరాలు నవంబర్ 15 వ తారీఖున కోలాహలం గా జరిగాయి. నాలుగు గంటల పైన జరిగినా ఈ వేడుకల్లో సుమారు 300 మంది పాల్గొన్నారు. సుమారు గా 75 మంది కళాకారులు, నృత్యాలు, తదితర అంశాలతో, ప్రేక్షకులను వినోదింప చేశారు. కార్యక్రమం లో భాగమైన 'చిన్నారుల నృత్యాలూ, ఫ్యూజన్ డాన్స్ మొదలైన అంశాలు ప్రేక్షకులను విశేషం గా ఆకర్షించాయి. పద్మిని తమిరిస, మూర్తి అందుకూరి, అశోక కోడాలి, అరుణ చల్లపల్లి, పద్మ అత్యం, రఘు జడల, సుకన్య బూరుగు, శ్రీని గిల్లిపెల్లి, ప్రవీణ్ నూతులపాటి, శ్రీలత మద్దూరి, సమ్యు రావ్ తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణకు ఎంతో కృషి చేశారు. ప్రత్యేక ఆకర్షణ గా ఈ కార్యక్రమం చివరన జరిగిన "మహిషాసుర మర్దిని" కూచిపూడి నృత్య నాటకం ప్రేక్షకులను ముగ్ధులను చేసింది. శ్రీ పసుమర్తి వేంకటేశ్వర శర్మ గారి శిక్షణ లో, స్థానిక " సాయి నాట్య నికేతన్ " కి చెందిన , శ్రీమతి శ్రీలత మద్దూరి మరియు బృందం ప్రదర్శించిన ఈ అంశం, సుమారు గంట సేపు ప్రేక్షకులను ఎంతో అలరింపజేసింది.