వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యను హతమార్చిన ఎన్నారై టెక్కీ అరెస్టు!

By B N Sharma
|
Google Oneindia TeluguNews

NRI
లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని అరయా జిల్లాలో తన భార్యను చంపిన ఒక ఎన్నారై అమెరికా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను, అతిని ముగ్గురు కుటుంబ సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెపుతున్నారు.

వివరాల్లోకి వెళితే, ఎన్ ఆర్ ఐ గణేశ్ శంకర్ మిశ్రా, అతని తండ్రి దేవదత్ మిశ్రా, తల్లి సులక్షణ మిశ్రా, సోదరి మీనా ద్వివేది లను హత్యా అభియోగంపై పోలీసులు అరెస్టు చేశారు.

జూలై 23న గణేష్, అతని భార్య అంశూల్ వారి ఇద్దరు పిల్లలు అమెరికానుండి ఇండియా కు వచ్చారు. జూలై 27న అంశూల్ ఆమె ఇంట్లో హత్య చేయబడింది. అయితే, గణేష్ అతని కుటుంబం కలిసి ఈ హత్య ఒక దోపిడీ సంఘటనలో జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే, పోలీస్ దర్యాప్తులో వారే మరో ఇద్దరు వ్యక్తుల సహాయంతో ఈ హత్య చేసినట్లు వెల్లడైంది. సహాయం చేసిన వ్యక్తులకు చెరి ఒక్కరికి రూ. 2.5 లక్షల వరకు ముట్ట చెప్పినట్లుగా కూడా వెల్లడైంది. రాహుల్ తివారి, ఓం చౌదరి అనే ఈ ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Ganesh Shankar Mishra, an NRI, was arrested along with his father Devdutt Mishra, mother Sulakshana Mishra and sister Meena Dwivedi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X