వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబాయ్‌లో ఆంధ్ర డ్రైవర్ హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Driver from Andhra Pradesh murdered in Dubai
రాజమండ్రి: దుబాయ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ టాక్సీ డ్రైవర్ హత్యకు గురయ్యాడు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. హత్యకు గురైన టాక్సీ డ్రైవర్ ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లాకు చెందినవాడు.

తూర్పు గోదావరి జిల్లా సఖిలేటిపల్లికి చెందిన కె. సూర్యనారాయణ రాజు (30) రెండు నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ ట్రావెల్ ఏజెన్సీలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వివాహమైంది. గుర్తు తెలియని వ్యక్తులు టాక్సీని మాట్లాడుకుని మనుషుల సంచారం లేని ప్రదేశానికి తీసుకుని వెళ్లారు. అక్కడ అతన్ని హత్య చేశారు.

అతన్ని హత్య చేసి మృతదేహాన్ని పక్కన పడేసి, టాక్సీని తీసుకుని దుండగులు పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సూర్యనారాయణ రాజు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.

అతని హత్య వార్త తెలిసిన కుటుంబ సభ్యులు సఖిలేటిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొని ఉంది. పొట్ట పోసుకోవడానికి వెళ్లిన సూర్యనారాయణ రాజు హత్యకు గురి కావడంతో తట్టుకోలేకపోతున్నారు.

English summary
A taxi driver, hailing from East Godavari District of Andhra Pradesh was allegedly murdered by three unidentified persons in Dubai, police said here on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X