దక్షిణాఫ్రికాలో హైదరాబాదీ మరణం

South Africa Map
దక్షిణాఫ్రికాలో హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మరణించాడు. ఉద్యోగం కోసం అక్కడికి వెళ్లిన ఆయన గుండెపోటుతో మరణించినట్లు ఇక్కడికి సమాచారం అందింది. దీంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. వేణుగోపాల్ అనే 40 ఏళ్ల వ్యక్తి తీవ్ర ఒత్తిడికి గురి కావడం వల్లనే మరణించాడని అంటున్నారు.

అందిన వివరాల ప్రకారం - హైదరాబాదులోని సనత్‌నగర్‌కు చెందిన మురహరి కుమారుడు వేణుగోపాల్‌తో లంగర్‌హౌస్‌కు చెందిన రాణితో పదిడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి అశ్విని అనే 13 ఏళ్ల కూతురు కూడా ఉంది. వేణుగోపాల్ గతంలో రువాండాలో వ్యాపారం చేసి నష్టాల పాలయ్యాడు. దాంతో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి చేరాడు.

నిరుడు అతను హైదరాబాద్ వచ్చాడు. తండ్రి, తమ్ముడు కలిసి రెండు కోట్ల రూపాయల ఆస్తిని లాక్కుని వేణుగోపాల్‌ను వెళ్లగొట్టారు. దీంతో అతను లంగర్‌హౌస్‌లో గల ప్రశాంతనగర్‌లో గల అత్తింట్లో ఉంటూ వస్తున్నాడు. వారం కింద సజికోనోవా కంపెనీ తరఫున దక్షిణాఫ్రికాలో ఉద్యోగం చేయడానికి వెళ్లాడు. తండ్రి, సోదరుడి చర్యతో అతను మనస్తాపానికి గురయ్యాడు. దాంతో బుధవారం గుండెపోటుతో మరణించాడు. వేణుగోపాల్ మరణించిన తర్వాత కూడా తండ్రి, సోదరుడు పరామర్శకు రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+