చైనాలో ఆంధ్రా టెక్కీ భార్య ఆత్మహత్య

 Indian woman dies in Chaina
కరీంనగర్: జిల్లాలోని గోదావరిఖనికి చెందిన యువతి చైనాలోని షాంగై నగరంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్ఫోసిస్‌లో సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న జల్లారం రమేష్ భార్య మృదులా దేవి షాంగైలోని ఒక అపార్టుమెంటు పైనుండి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు తెలిపారు. ఎఫ్.సి.ఐ. మాజీ ఉద్యోగి వీరయ్య కూతురు మృదుల.

ఈమె ఎంసియే పూర్తి చేసింది. రమేష్‌తో 2006లో వివాహం అయింది. మే నెలలోనే తన అయిదు సంవత్సరాల కూతురు సాయి హర్షిణితో చైనాకు వెళ్లిన మృదులా దేవి రెండు రోజుల క్రితం అక్కడ ఉండలేకపోతున్నట్లు అత్తకు ఫోన్ చేసి తెలిపింది. ఈ నేపథ్యంలో శనివారం భారత్‌కు తిరిగి వచ్చేందుకు టిక్కెట్ కూడా బుక్ చేసుకున్నారు. శుక్రవారం రమేష్ బ్యాంకుకు డబ్బుల కోసం వెళ్లిన సమయంలో అపార్టుమెంటు 9వ అంతస్తు పైనుంచి దూకి మృదుల ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు.


సౌదీలో భారతీయుల అరెస్ట్

మరోవైపు మక్కా యాత్ర కోసం భారతదేశం నుంచి సౌదీ అరేబియాకు వచ్చిన ఆరుగురు యా త్రికులను జెడ్డా విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. యాత్రికులు వారివెంట గసగసాలు తీసుకొచ్చారన్న కారణంగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగి రెండు నెలలవుతున్నా ఇప్పటివరకు భారత దౌత్యాధికారులకు సమాచారం లేదు.

గసగసాల ద్వారా హెరాయిన్ తయారు చేస్తారు కాబట్టి మాదక ద్రవ్యాల రవాణా కేసు కింద వారిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ నుంచి ముగ్గురు, న్యూఢిల్లీ నుంచి మరో ముగ్గురు అరెస్టైన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి.. 11 మందిని వదిలిపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+