ఎన్నారై వ్యాపారి దారుణ హత్య
హేమంత్ చౌహాన్ (58) అనే వ్యక్తి సూరత్లోని సుముల్ డెయిరీ రోడ్డులో గల శాంతినికేతన్ సొసైటీలో ఉండేవాడు. అమెరికాలోని మోటెల్స్లో పనిచేసిన అతను ఏడాది క్రితం స్టోర్ను తీసుకున్నాడు. అతను 2001లో అమెరికా వెళ్లాడు. నేవార్క్లోని న్యూపోర్ట్ పెన్ బాంటమ్ మార్కెట్ స్టోరులోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి కౌంటర్ దగ్గరకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేశారు.
వారితో హేమంత్కు స్వల్వ వివాదం జరిగింది. దుండగులు హేమంత్ చౌహాన్ను కత్తులతో పొడిచి డబ్బులు తీసుకుని పారిపోయారు. క్రిస్టియన్ ఆస్పత్రికి తరలించే లోగానే అతను మరణించాడు. ఈ సంఘటన జరిగినప్పుడు హేమంత్ భార్య భూమిక కూడా స్టోర్లో ఉందని అతని మరదలు రమీల చౌహన్ చెప్పారు.
హేమంత్ కుమారుడు విశాల్ (28) తన కుటుంబ సభ్యులతో సూరత్లోనే ఉంటున్నాడు. విశాల్ కుట్టు మిషన్ల యూనిట్ను నడుపుతున్నాడు. నిందితులను పోలీసులు ఇంకా పట్టుకోలేదని తెలుస్తోంది. భూమిక ఇప్పటికీ షాక్ నుంచి తేరుకోలేదని, దుండగులు ఎంత సొమ్ము ఎత్తుకెళ్లారనేది తెలియడం లేదని అంటున్నారు.