ఎన్నారైలతో ఎమ్మెల్యే దంపతులు

ఒకే జిల్లా నుంచి, ఒకే పార్టీ నుంచి వారిద్దరు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాదాపు 200 మంది ఎన్నారైలు నరేంద్ర కొత్తకోట నివాసంలో వారితో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాల గురించి, పరిస్థితి గురించి ఎన్నారైలు వారిని అడిగి తెలుసుకున్నారు.
ఎన్నారైలు ప్రస్తుత రాజకీయాల్లో అవినీతి గురించి, మహబూబ్నగర్ జిల్లా వెనకబాటు, దాని అభివృద్ధి గురించి, తెలంగాణ గురించి పలు ప్రశ్నలను వారికి వేశారు. వాటన్నింటికి దయకార్ రెడ్డి దంపతులు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. పాలన పెద్ద సవాల్ను ఎదుర్కొంటోందని వారు అభిప్రాయపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి తాము చేస్తున్న కృషిని వివరించారు.
కూలీల వలసలు, నిరక్షరాస్యత, పారిశుధ్య లోపం వంటి సమస్యలను మహబూబ్నగర్ జిల్లా ఎదుర్కుంటోందని వారు చెప్పారు. ఈ స్థితిలో అభివృద్ధికి ఎన్నారైలు సహకరించాలని ఎమ్మెల్యే దంపతులు కోరారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఎమ్మెల్యే దంపతులతో భేటీ అయినవారిలో విజయ్ చవ్వా, నరేంద్ర కొత్తకోట, భాస్కర్ మద్ది, కెవి రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, రాఘవేంద్ర, మధు వంగా వంటివారున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications