ఇండియన్ డయాస్పోరాతో మోడీ
కమ్యూనిటీ అవుట్రీచ్లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఆదివారం పదో తేదీ ఉదయం ఆరున్నర గంటలకు నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. కమ్యూనిటీ అవుట్రీచ్ కార్యక్రమం చికాగోలోనూ న్యూజెర్సీలోనూ ఉంటుందని బిజెపి ఓవర్సీస్ మిత్రుల అధ్యక్షుడు జయేష్ పటేల్ ఓ ప్రకటనలో చెప్పారు.
ఒకేసారి రెండు చోట్ల జరిగే కమ్యూనిటీ అవుట్రీచ్ కార్యక్రమానికి పెద్ద యెత్తున ఎన్నారైలు హాజరవుతారని భావిస్తున్నారు. టీవీ ఆసియా ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. నాలుగో విడత గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోడీ భారతదేశానికి సంబంధించి నిర్ణయాత్మక, దార్శనిక, భయరహిత నాయకుడని ఆ ప్రకటనలో అన్నారు. గుజరాత్ సర్వతోముఖాభివృద్ధి జాతీయస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు అందుకుంటోందని జయేష్ పటేల్ అన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయ్ జోలీ (బిజెపి ఓవర్సీస్ వ్యవహారాల ఇంచార్జీ), బిజెపి ఓవర్సీస్ మిత్రుల ప్రెసిడెంట్ ఎలెక్ట్ చంద్రకాంత్ పటేల్, సమీప మాజీ అధ్యక్షుడు అడప ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం వెబ్సైట్లో కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు.