దుబాయ్లో సంక్రాంతి వేడుకలు (ఫొటోలు)
దుబాయ్: దుబాయ్లోని జాబీల్ పార్క్లో తెలుగు వారందరి కోసం 'వేవ్' సాంస్కృతిక సంస్థ వారు నిర్వహించిన సంక్రాంతి సంబరాలు జయప్రదం అయ్యాయి. సుమారుగా వెయ్యికి పైగా తెలుగువాళ్ళు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు నిర్వాహకూరాలు గీత రమేశ్ తెలిపారు.
పిల్లలకి 'భోగిపండ్లు' పోయడం దగ్గర నుంచి మహిళలకి "వంటల పోటీలు", పురుషులకి "ఉట్టి" కొట్టే పోటీ, "కబడ్డీ" పోటీలు నిర్వహించారు. బాలబాలికల కోసం "పతంగుల" పోటీలు కూడా నిర్వహించారు. ఇక రంగు రంగుల ముగ్గుల పోటీలు సరే సరి...
పెద్దవాళ్ళు కూడా ఎంత మాత్రం ఉత్సాహం తగ్గకుండా 'తంబోలా', 'లక్ డిప్' కార్యక్రమాలతో హడావిడి చేశారు. మొత్తానికి చిన్నా పెద్ద అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ 'సంక్రాంతి' సంబరాలను అంబరాన్ని అంటాయి, హుషారుతో, కేరింతలతో వేడుకలను జరుపుకున్నారు.
తమ
కార్యక్రమం
ఇంత
దిగ్విజయం
కావడానికి
సహకరించిన
ప్రతి
ఒక్కరికీ,
ముఖ్యంగా
స్పాన్సరర్స్
అందరికీ
కార్యక్రమ
నిర్వాహక
అధ్యక్షురాలు
గీతా
రమేశ్
కృతజ్ఞతలు
తెలిపారు.
సంక్రాంతి వేడుకల్లో మహిళలు, పిల్లలు ఇలా సందడి చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.
పోటీల్లో పాల్గొన్న పిల్లలు. వారిని పర్యవేక్షిస్తూ పెద్దలు ఇలా...
కబడ్డీ ఆడుతూ పురుషులు ఇలా... ఒక జట్టును మరో జట్టును ఓడించడానికి పోటీ పడుతూ..
మహిళలకు ముగ్గుల పోటీలు... వాటిని పరిశీలిస్తూ ఇలా...
అందరూ కలిసి భోజనాలు చేస్తూ వేడుకలను సామూహికంగా నిర్వహించుకున్నారు.
మహిళలకు వంటల పోటీలు కూడా జరిగాయి. ఇలా పోటీల్లో...