దుబాయ్లో సంక్రాంతి వేడుకలు
దుబాయ్: తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు తెలుగు స్రవంతి ఆధ్వర్యంలో దుబాయ్లోని క్రీక్ పార్క్లో కన్నుల పండుగగా జరిగాయి. వివిధ వాణిజ్య సంస్థల సహకారంతో తెలుగు స్రవంతి నిర్వహించిన సంక్రాంతి వేడుకల కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి.
తెలుగువారి పెద్ద పండుగ తెలుగు గడ్డ మీద జరుపుకోలేకపోతున్న తెలుగు ప్రజల కోసం తెలుగు స్రవంతి ఆధ్వర్యంలో అచ్చం మన తెలుగు పల్లె వాతావరణంలో తెలుగువారి సంస్కృతిని గుర్తుకు తెచ్చే సాంస్కృతిక కార్యక్రమాలతో పసందయిన తెలుగు వంటకాలతో జరిగింది. సంక్రాంతి నాడు గ్రామీణ వాతావరణంలో నిర్వహించే గ్రామీణ క్రీడాపోటీలు జరిగాయి. తెలుగు ఇంటి ఆడబిడ్డలు వేసిన రంగవల్లులు ముచ్చట గొలిపాయి. పిల్లలకు ఆటల పోటీలు, యువకులకు కబాడీ వంటి ఆటల పోటీలు జరిగాయి.
పిల్లలు ఎగరేసిన ఫతంగుల రెపరెపలు, తెలుగు మహిళలు వేసిన రంగురంగుల రంగవల్లులు,యువకుల కేరింతలతో పార్క్ మొత్తం ఎటు చూసినా తెలుగు ప్రజల కోలాహలం చోటు చేసుకుంది. ఈ సందర్బంగా ప్రత్యేకంగా చిన్నారులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది.
తమ పెద్ద పండుగ సంక్రాంతి ని సొంత ఊళ్లలో జరుపుకోలేకపోతున్నామని, ఈ స్థితిలో ఇక్కడ సంక్రాంతి వేడుకలు చాలా ఆనందాన్ని ఇచ్చాయని, తెలుగు స్రవంతి సంస్థ సంక్రాంతి వేడుకలను నిర్వహించినందుకు అభినందిస్తున్నామని వేడుకల్లో పాల్గొన్నవారు అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు కార్యక్రమ నిర్వాహకులు వొబ్బిలిశెట్ిట అనురాధకను, తెలుగు స్రవంతి కార్యవర్గ సభ్యులను వారు అభినందించారు.