NRI News: భారత సంతతికి చెందిన ఇద్దరికి జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు
ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వ్యక్తులకు అమెరికా కోర్టు శిక్ష విధించింది. చికాగోకు చెందిన హెల్త్ టెక్నాలజీ స్టార్ట్-అప్ కంపెనీ లో ఎగ్జిక్యూటివ్ల పని చేసిన వీరు కంపెనీ క్లయింట్లు, రుణదాతలు, పెట్టుబడిదారులను లక్ష్యంగా చేసుకుని మోసం చేసినట్లు విచారణ తేలింది. దీంతో కోర్టు వారికి శిక్ష ఖరారు చేసింది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం వీరు మోసపూరితంగా సుమారుగా $1 బిలియన్ (భారత కరెన్సీలో రూ. 7500 కోట్లు) నిధులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిందితులను 38 ఏళ్ల రిషి షా, 38 ఏళ్ల శ్రద్ధ అగర్వాల్ గా గుర్తించారు. మరో వ్యక్తి, 35 ఏళ్ల బ్రాడ్ పర్డీకి కూడా జైలు శిక్ష పడింది. రిషికి జూన్ 26న ఏడేళ్ల ఆరు నెలల జైలు శిక్ష విధించగా, శ్రద్ధకు జూన్ 30న మూడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. బ్రాడ్కు జూన్ 30న రెండేళ్ల మూడు నెలల జైలు శిక్ష ఖరారు చేసింది. కోర్టుకు సమర్పించిన సాక్ష్యాల ప్రకారం 2006లో ఈ ఇద్దరు కంపెనీని స్థాపించారు. జనవరి 2017లో యునైటెడ్ స్టేట్స్లోని వైద్యుల కార్యాలయాలలో టెలివిజన్ స్క్రీన్లు, టాబ్లెట్లను ఇన్స్టాల్ చేసి, ఆపై ఖాతాదారులకు ఆ పరికరాలపై ప్రకటనలు ఇచ్చి ఆదాయం పొందేవారు.

వీటిలో ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. షా, అగర్వాల్, పర్డీ కంపెనీ స్వంతం కాని ప్రకటనల జాబితాను అవుట్కమ్ క్లయింట్లకు విక్రయించి డబ్బులు సంపాదించారు. ఆపై దాని ప్రకటనల ప్రచారాలపై తక్కువ పంపిణీ చేశారు. ఈ తక్కువ డెలివరీలు ఉన్నప్పటికీ, కంపెనీ ఇప్పటికీ తన క్లయింట్లను పూర్తిగా డెలివరీ చేసినట్లుగానే ఇన్వాయిస్ చేసి కోట్ల రూపాయలు గడించారు.
షా, అగర్వాల్, పర్డీ అబద్ధాలు చెప్పారని లేదా క్లయింట్ల నుంచి తక్కువ డెలివరీలను దాచిపెట్టారని కోర్టులో వాదించారు. క్లయింట్ల కాంట్రాక్ట్లలోని స్క్రీన్ల సంఖ్యకు కంపెనీ అడ్వర్టైజింగ్ కంటెంట్ను డెలివరీ చేస్తున్నట్లుగా కనిపించేలా చేయడానికి ఇతరులకు అబద్ధం చెప్పారని వివరించారు. షా, అగర్వాల్ మరియు పూర్డీ కూడా అవుట్కమ్ రుణదాతలు, పెట్టుబడిదారులను మోసం చేశారని తేలడంతో వారికి శిక్ష కన్ఫమ్ అయింది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications