వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిత్రులు చూస్తుండగా: అమెరికాలో ఆంధ్ర టెక్కీ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికాలోని ఓ నదిలో నదీ స్నానం చేస్తూ మృతి చెందాడు. శివదేవుని చిక్కాల గ్రామానికి చెందిన నిమ్మల రామారావు కుమారుడు నిమ్మల జయశేష రాఘవేంద్రరావు (25) అమెరికాలో మరణించాడు.

ఆయన అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రంలో ఎంఎస్ చదువుతూ, ఒక ప్రముఖ కంపెనీలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతడు స్నేహితులతో కలిసి నదీ స్నానానికి వెళ్లాడు. అక్కడ స్నానం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు.

Andhra techie dies in USA

స్నేహితుల కళ్లముందే ఈ ఘోరం చోటుచేసుకుంది. కొద్దిసేపటికే మృతదేహం బయటపడింది. అమెరికాలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా జీవితంలో ఎదుగుతున్న ఒక్కగానొక్క కుమారుడు మృత్యువాత పడటంతో రామారావు కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

English summary
Andhra software engineer has dead in USA drowing in a river. The techie Nimmala Jayasesha Raghavendra Rao is from West Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X