లండన్ వీధుల్లో హైదరాబాదీల గణేశుడి ఊరేగింపు
లండన్: లండన్లోని హైదరబాద్ ఫ్రెండ్స్ యూత్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం కార్యక్రమం జరిగింది. భారీ ఎత్తున లండన్ హొఉన్స్లొవ్ వీధుల్లో భజనలు, అటపాటలతో కార్యక్రమం సాగింది. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు పాల్గొని, ఆటపాటలతో సంబరాలు చేశారు.
గణపతి బప్పా మోరియా భారత్మాతాకి జై అనే నినాదాలతో లండన్ వీధులు దద్దరిల్లాయి, బ్రిటిష్ వాళ్లు సైతం వచ్చిఈ వేడుకల్లల్లో పాల్గొనడం విశేషం. సంస్థ అద్యక్షులు దూసరి అశోక్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాద్ ఒక్క కాస్మో పాలిటన్ నగరమని, వివిధ ప్రాంతాలు మతాల ప్రజలు కలిసి మెలిసిఉంటారని, అలాగే ఇక్కడ కూడా అందరినీ కలుపుకొనిఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమానికి సహాయసహకారాలు అందించిన అన్నిసంస్థలకు కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు సీకా చంద్రశేఖర్, ఉపాధ్యక్షురాలు పవిత్ర రెడ్డి, సలహాదారు ఉదయ నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈవెంట్ నిర్వాహకులు గోలి తిరుపతి, కవిత, కాసర్ల నాగేష్ రెడ్డి, జ్యోతి, వంశీ, దీప్తి, శశిధర్, సుమన్ గోలి, మల్లారెడ్డి, శుష్మ, శ్రవణ్ రెడ్డి, సుధాకర్, శౌరి, జితేందర్, సతీష్, మోహన్, సందీప్ గౌడ్, ఎల్లేందర్, మధు, సత్యం, సంగిరెడ్డిగుప్త కాసం, వెంకట్ రెడ్డి, విష్ణు, ఓం ప్రకాష్, కిషోర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.