విమానంలో భార్య పక్కనుండగానే యువతితో లైంగిక చర్య, ఐటీ మేనేజర్ను దోషిగా తేల్చిన డెట్రాయిట్ కోర్టు
వాషింగ్టన్: తన పక్కనే కట్టుకున్న భార్య ఉందన్న ఇంగితం కూడా లేకుండా పక్క సీట్లో కూర్చున్న ఓ యువతిని లైంగికంగా వేధించిన భారతీయుడిని అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. ఏడు నెలల క్రితం ఈ ఘటన జరగ్గా విచారణ అనంతరం కోర్టు అతడిని దోషిగా తేల్చింది. డిసెంబరులో అతడికి శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది.

భార్యతో కలిసి విమానం ఎక్కాడు..
రమణమూర్తి అమెరికాలోని రోచెస్టర్ హిల్స్ సిటీలో ఉంటూ ఓ ఐటీ సంస్థలో మేనేజరుగా పనిచేసేవాడు. ఏడు నెలల క్రితం తన భార్యతో కలిసి లాస్వేగాస్లో డెట్రాయిట్ వెళ్లే స్పిరిట్ ఎయిర్లైన్స్ విమానం ఎక్కాడు.

భార్య పక్కనుండగానే యువతితో లైంగిక చర్య
రమణమూర్తికి ఓవైపు భార్య...మరోవైపు 22 ఏళ్ల యువతి కూర్చున్నారు. కొద్ది సేపటికి నిద్రలో జారుకున్న యువతిపై రమణమూర్తి లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. దీంతో ఆమె మేల్కొని అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

నా బటన్స్ విప్పేశాడంటూ బాధితురాలు
‘లేచి చూసేసరికి తన దుస్తుల బటన్స్ విప్పి ఉన్నాయి. రహస్య భాగాల వద్ద మూర్తి చేతులు తడుముతూ కనిపించాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశాను' అని బాధితురాలు ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారణ చేపట్టారు.

చివరకు నేరం అంగీకరించిన రమణ
కాగా, ఆ సమయంలో తాను గాఢంగా నిద్రపోతున్నాననీ, తనకేం తెలియదంటూ రమణమూర్తి మొదట చెప్పుకొచ్చాడు. లోతుగా ప్రశ్నించేసరికి... చేయకూడనిది చేసి ఉంటానని నేరం అంగీకరించాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మిచిగాన్లోని డెట్రాయిట్ న్యాయస్థానం ఇటీవల అతడిని దోషిగా తేల్చింది. అతనికి వచ్చే డిసెంబర్లో శిక్షను ఖరారు చేయనుంది.
-
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications