వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భవనంపై నుంచి పడి తల్లీబిడ్డ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Dubai
దుబాయ్: దుబాయ్‌లోని ఎత్తయిన భవనంపై నుంచి పడి తల్లీబిడ్డలు మృతి చెందారు. ఇరవై ఏళ్ల వయస్సులో ఉన్న మహిళతో పాటు బిడ్డ భవనంపై నుంచి పడ్డారు. జుమేరా గ్రామంలోని మాన్‌హట్టన్ టవర్ 11వ అంతస్థుపై నుంచి తల్లీబిడ్డలు కింద పడ్డారని గల్ఫ్ న్యూస్ రాసింది.

ఆ సంఘటన మంగళవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో జరిగింది. బాల్కనీలోంచి తల్లీబిడ్డలు కిందపడినప్పుడు ఆమె భర్త ఇంట్లోనే ఉన్నాడు. ప్రస్తుతం అతను పోలీసు కస్టడీలో ఉన్నట్లు సమాచారం.

అయితే, సంఘటన వేరే విధంగా జరిగిందని చెప్పడానికి ఆధారాలు లేవని పోలీసులు అంటున్నారు. అయితే, దర్యాప్తు మాత్రం జరుగుతుందని అన్నారు. ఆ కుటుంబం ఏడాది పాటుగా ఆ భవనంలో ఉంటోంది. మహిళ ఆత్మహత్య చేసుకుందని చెప్పడానికి ఆధారాలు లేవని, ఏ విధమైన సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు చెప్పారు.

అయితే, దర్యాప్తు పూర్తయ్యే వరకు తల్లీబిడ్డల మృతిపై వివరాలను చెప్పలేమని అన్నారు. బిడ్డతో కలిసి మహిళ ఆత్మహత్య చేసుకుందా, ప్రమాదవశాత్తు కిందపడిందా అనేది తేలాల్సి ఉందని అన్నారు.

English summary
An Indian woman in her late 20s and her child fell to their death from a high-rise building in Dubai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X