NRI News: ఎన్నారై దంపతులుపై దాడి.. ఎక్కడంటే..!
జులై 25, 26 మధ్య రాత్రి పంజాబ్కు చెందిన ఎన్నారై కుటుంబంపై జరిగిన దాడిపై విచారణ జరిపించాలని ఎన్నారై వ్యవహారాల మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాలా ఈరోజు హర్యానా ప్రభుత్వాన్ని కోరారు. జలాలాబాద్లోని చిమ్నేవ్లా గ్రామానికి చెందిన వ్యవసాయ నాయకుడు మాస్టర్ బూటా సింగ్, న్యూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆస్ట్రేలియా నుండి తిరిగి వచ్చిన తన భార్య సుఖ్విందర్ కౌర్ను తీసుకురావడానికి వెళ్లినట్లు ధాలివాల్ చెప్పారు.
వారు ఎయిర్ పోర్టు నుంచి తిరిగివస్తున్న క్రమంలో రోహ్తక్-సిర్సా రోడ్డులో తమ కారుపై దుండగులు దాడి చేశారని, పెట్రోల్ బంకులోని బాత్రూమ్లో దాక్కుని దంపతులు తమ ప్రాణాలను ఎలాగోలా కాపాడుకున్నారని ధాలివాల్ తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే ఎన్ఆర్ఐల భద్రతకు, నిందితులను గుర్తించాలని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైనీకి లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు.

చాలా కిలోమీటర్లు తమని ఎవరో అనుసరించారని ఎన్నారై దంపతులు చెప్పారు. దారిలో బేస్బాల్తో కూడా దాడి చేశారని పేర్కొన్నారు. ఇంతలో పెట్రోల్ పంపులోని బాత్రూమ్కు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నట్లు వివరించారు. తమని ఆపి, బేస్ బాల్ బ్యాట్తో దాడి చేశారు.
ముఖ్యంగా రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని హర్యానా డీజీపీని ఆదేశించారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఏఐజీ ఎన్నారై జేఎస్ వాలియాను ఆదేశించిన మంత్రి, కారు డ్రైవర్కు లక్ష రూపాయల రివార్డును కూడా ప్రకటించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. హర్యానాలో ఎన్నారై కుటుంబంపై దాడిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications