NRI News: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో ఇండియాలో పెరగనున్న ఎన్నారై పెట్టుబడులు..!
ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తతతో భారత్ లో పెట్టుబడి పెట్టేందుకు ఎన్నారైలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభంతో ప్రధాన ప్రాంతీయ ఈక్విటీ గేజ్లు అక్టోబర్ మొదటి వారంలో పడిపోయాయి. ఇజ్రాయెల్ బెంచ్మార్క్ TA-35 స్టాక్ ఇండెక్స్లో 7 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ఇండియాలోని బెంగళూరు, పూణె, హైదరాబాద్ వంటి భారతీయ మార్కెట్లలో దుబాయ్ నుంచి NRI పెట్టుబడులు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ANAROCK గ్రూప్లో బెంగళూరు నగర అధిపతి ఆశిష్ శర్మ ప్రకారం బెంగళూరులో NRI పెట్టుబడులు ప్రధానంగా దుబాయ్తో సహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచే కాకుండా US, UK వంటి పశ్చిమ దేశాల నుంచి వస్తాయని చెబుతున్నారు. నైట్ ఫ్రాంక్ ఇండియా డేటా ప్రకారం దుబాయ్ నుంచి భారతదేశంలోకి 2018 నుంచి 2022 వరకు పెట్టుబడులు $2.7 బిలియన్లకు చేరుకున్నాయి. గత సంవత్సరం $565 మిలియన్లు వచ్చాయి.

"మా క్లయింట్లలో దాదాపు 90 శాతం మంది ఎన్నారైలు ప్రస్తుతం మూలధన రక్షణ కోసం చూస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత దుబాయ్, బహ్రెయిన్ వంటి ప్రాంతాలు NRI పెట్టుబడి గమ్యస్థానాలుగా పెరిగాయి." అని US-ఆధారిత రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కోల్డ్వెల్ బ్యాంకర్ స్థానిక కార్యాలయంలో మేనేజింగ్ భాగస్వామి బాలాజీ బద్రీనాథ్ అన్నారు. వివాదాలతో దెబ్బతిన్న పశ్చిమాసియా ప్రాంతం, యుఎస్, యూరోపియన్ మార్కెట్ల కంటే భారత మార్కెట్లోని తేలికైన మూలధన రక్షణను అందిస్తుందని నిపుణులు తెలిపారు.
భారతీయ మైక్రో మార్కెట్లు దీర్ఘకాలిక పెట్టుబడులకు సానుకూల సూచికలను అందిస్తున్నాయని జోన్స్ లాంగ్ లాసాల్లే సీనియర్ డైరెక్టర్ రితేష్ మెహతా అన్నారు. దుబాయ్కి చెందిన ప్రాపర్టీ జంక్షన్లోని కన్సల్టెంట్ విజయ్ సావ్లానీ మాట్లాడుతూ, గత ఆరు నెలల్లో దుబాయ్లో ధరలు 15-18 శాతం పెరిగాయని, డౌన్టౌన్ ప్రాంతంలోని కొన్ని ప్రైమ్ ప్రాపర్టీలలో 30 శాతం పెరిగాయని చెప్పారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications