మెరుగైన మానసిక ఆరోగ్యం దిశగా భారత్ అడుగులు..300 సంస్థలతో చేతులు కలిపిన'IMHA'
భారతదేశంలో మానసిక ఆరోగ్య రంగంలో ఒక సరికొత్త విప్లవం ఆరంభమైంది. దేశవ్యాప్తంగా విడివిడిగా పనిచేస్తున్న సంస్థలను ఒకే తాటిపైకి తెస్తూ ఇండియా మెంటల్ హెల్త్ అలయన్స్ (IMHA) ఒక భారీ మైలురాయిని అధిగమించింది.
దేశంలోని మానసిక ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో పనిచేస్తున్న 'ఇండియా మెంటల్ హెల్త్ అలయన్స్ (IMHA)', తాజాగా ఒక కీలక ఘట్టాన్ని చేరుకుంది. 30 దేశాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 300 సభ్య సంస్థలతో కూడిన అతిపెద్ద కూటమిగా ఇది అవతరించింది. కేవలం సంఖ్యపరంగానే కాకుండా, ప్రభుత్వ, ప్రైవేట్ మరియు దాతృత్వ రంగాలను ఏకం చేస్తూ సమన్వయంతో పనిచేయడమే ఈ కూటమి ప్రధాన ఉద్దేశ్యం.

సమిష్టి కృషితోనే మార్పు సాధ్యం - నేహా కిర్పాల్
IMHA కో-ఫౌండర్ నేహా కిర్పాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "300 సభ్య సంస్థలను చేరుకోవడం అనేది వ్యవస్థలో ఒక గొప్ప మార్పుకు సంకేతం. వేర్వేరు సాంస్కృతిక నేపథ్యాలు కలిగిన సంస్థలు తమ అనుభవాలను పంచుకోవడం వల్ల దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవల నాణ్యత పెరుగుతుంది. 'వికసిత్ భారత్' దిశగా సాగే ప్రయాణంలో మానసిక ఆరోగ్యాన్ని ప్రధానాంశంగా మార్చడమే మా లక్ష్యం" అని పేర్కొన్నారు.
IMHA చేపట్టిన కీలక కార్యక్రమాలు:
గత ఏడాది కాలంలో ఈ భాగస్వామ్యం అనేక వినూత్న కార్యక్రమాలను చేపట్టింది:
- నేషనల్ డైరెక్టరీ: క్యూఆర్ కోడ్ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న మానసిక ఆరోగ్య సంస్థలను గుర్తించే వీలు కల్పించారు.
- నైపుణ్యాభివృద్ధి: అంతర్జాతీయ నిపుణులతో నెలవారీ సెషన్లు నిర్వహిస్తూ.. యువత మానసిక ఆరోగ్యం, చట్టాలు మరియు ప్రభుత్వ విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు.
- రీజనల్ మీట్-అప్స్: ముంబైలో విజయవంతంగా మొదటి సమావేశం నిర్వహించగా, రాబోయే నెలల్లో గౌహతి (మే 2026), చెన్నై (ఆగస్టు 2026), బెంగళూరు (డిసెంబర్ 2026) లలో ప్రాంతీయ సమావేశాలు జరగనున్నాయి.
- నాలెడ్జ్ సెంటర్: ఇందులో 300కు పైగా పరిశోధనా పత్రాలు, టూల్కిట్స్ మరియు ప్రభుత్వ విధానాలు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ప్రాంతీయ భాషల్లో వీడియో పాఠాలను కూడా అందుబాటులోకి తేనున్నారు.
ఆర్థిక వృద్ధికి.. మానసిక ఆరోగ్యానికి లంకె
IMHA వ్యవస్థాపక అధ్యక్షురాలు వాస్వి భరత్ రామ్ మాట్లాడుతూ.. "అభివృద్ధి చెందిన భారత్ అంటే మానసిక ఆరోగ్యవంతులైన భారతీయులు ఉన్న దేశం. ఆర్థిక వృద్ధి, పని సామర్థ్యం మరియు సామాజిక ఐక్యత అనేవి పౌరుల మానసిక స్థితిపై ఆధారపడి ఉంటాయి. అందుకే దాతలు, ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలి" అని పిలుపునిచ్చారు. మనీషా ధావన్, డాక్టర్ ఫిరోజా గోద్రెజ్ వంటి ప్రముఖ దాతలు ఇప్పటికే ఈ దిశగా తమ మద్దతును ప్రకటించారు.
2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలంటే,పౌరుల మానసిక దృఢత్వం చాలా ముఖ్యం. IMHA చేస్తున్న ఈ సమిష్టి కృషి, మానసిక సమస్యలను కేవలం వ్యక్తిగత సమస్యలుగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తిస్తూ సరికొత్త దారిని చూపుతోంది.
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:
- Natasha Srivastava: [email protected]
- Anoushka Sharma : [email protected]
- Kaainaat Khan: [email protected]












Click it and Unblock the Notifications