మోహన్ రావుకు సిపి బ్రౌన్ అవార్డు

మోహన్ రావు 1943లో జన్మించారు. మద్రాసులో ఎస్ఎస్ఎల్సీ చదివారు. తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. బెంగుళూర్ ఐఐఎస్సీలో పిహెచ్డీ పట్టా తీసుకున్నారు. 1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్ గా పనిచేశారు. తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా పనిచేశారు. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రాశారు. పాటలు, పద్యాలు కూడా రాశారు. సుభాషితాలను సంకలనం చేశారు.
వైదేహి శశిధర్ కు ఇస్మాయిల్ పురస్తారం తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు వైదేహి శశిధర్ ను ఎంపిక చేసినట్లు యదుకుల భూషణ్ చెప్పారు. నిద్రిత నగరం అనే కవితా సంకలనం ఈ అవార్డుకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. న్యూజెర్సీలో నవంబర్ 7వ తేదీన జరిగే ఇస్మాయిల్ సంస్మరణ సభలో అవార్డును బహూకరించనున్నట్లు చెప్పారు. గతంలో పాలపర్తి ఇంద్రాణి, గోపిరెడ్డి రామకృష్ణారావు, గరికపాటి పవన్ కుమార్, పి. మోహన్ లకు ఈ అవార్డు లభించింది.












Click it and Unblock the Notifications