ఆధునిక సాహిత్యానికి ప్రాధాన్యం
జైపూర్: ‘మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సమ్మేళనం' మూడవ రోజు మరిన్ని యువ సాహితీవేత్తల సాహిత్య ప్రసంగాలతో బహు ముచ్చటగా జరిగింది. ఆశ్చర్యకరమూ, ఆనందదాయకమూ అయిన అంశం ఏమిటంటే ఈ రోజు సాయంత్రం (అక్టోబర్ 1, 2013- మంగళవారం) నిర్ణీత సమయం అయిన ఐదు గంటలకి పాటల కార్యక్రమం తో మొదలలిత లుపెట్టబడే సమయానికి సభా ప్రాంగణం కొంచెం పల్చగా ఉన్నప్పటికీ, యువతరం సాహిత్య ప్రసంగాల తొలి వేదిక సమయమైన ఆరు గంటలకి సభా ప్రాంగణం ప్రేక్షకులతో నిండిపోయింది. ఈ రోజు శ్రీ లక్ష్మణాచారి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ (స్థాపకురాలు: శశికళా స్వామి) విద్యార్ధినీ, లలిత గీతాలని మధురంగా ఆలపించారు.
ఆ తరువాత సాంప్రదాయబద్ధంగా జరిగిన ప్రారంభ సభలో సుప్రసిద్ధ కవి జొన్నవిత్తుల, ప్రముఖ గాయకులు త్రినాథ రావు, డా. ద్వానా శాస్త్రి , వంశీ రామరాజు , వంగూరి చిట్టెన్ రాజు పాల్గొన్నారు. సుప్రసిద్ధ రచయిత్రి భద్రపాత్రుని రమణి ప్రత్యేక ప్రసంగం చేశారు.

తరువాత 12 మంది యువ కవుల స్వీయ కవితా పఠనం లో కె. వెంకటేశ్, చిరంజీవి, మణికంఠ ల కవితలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆధునిక కవిత, అనువాద సాహిత్యం మొదలైన అనేక అంశాలపై మాట్లాడిన వక్తలందరూ పెద్దల కన్నా మిన్నగా బాగా తమ వ్యాసాలను తాయారు చేసుకున్నారు. వారిలో బాలాజీ, శంకర్, రాధిక, శ్యాం ప్రసాద్ ల ప్రసంగాలు తలమానికంగా నిలిచాయి.
ఈ మూడవ రోజు సభని కూడా గంగిశెట్టి లక్ష్మీ నారాయణల సమర్ధవంతంగా నిర్వహించారు. రేపటి నుండీ అక్టోబర్ 5 దాకా జరిగే ఈ మహా సభలకి ప్రతీ రోజూ సాయంత్రం 5 నుండి జరిగే ఈ యువ సాహితీ సభలకు అందరూ ఆహ్వానితులే.












Click it and Unblock the Notifications