Artificial Intelligence: మహిళా ఉద్యోగులకు శాపం, బలి అవుతుంది వీరే!
కృత్రిమ మేధస్సు (Artificial Intelligence), ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టెక్నాలజీ, ఆర్థిక సేవల రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు ఉద్యోగ భద్రతపై ముప్పు పెరుగుతోందని సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ తాజా నివేదిక హెచ్చరించింది. ఈ రంగాల్లో పనిచేస్తున్న మహిళలు తమ మగ సహచరులతో పోలిస్తే ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది.
నివేదిక ప్రకారం, కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్న మధ్య-స్థాయి వృత్తి మహిళలను టెక్, ఫైనాన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాల్లో డిజిటల్ పాత్రల కోసం పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదని తేలింది. ఇప్పటికే మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న ఈ రంగాల్లో, కఠినమైన నియామక ప్రక్రియలు ఆ అంతరాన్ని మరింత పెంచుతున్నాయని పేర్కొంది.

ప్రస్తుతం అనేక సంస్థలు వినియోగిస్తున్న ఆటోమేటెడ్ సీవీ స్క్రీనింగ్ విధానాలు మహిళా అభ్యర్థులకు అననుకూలంగా మారుతున్నాయని పరిశీలనలో వెల్లడైంది. పిల్లలు లేదా కుటుంబ సభ్యుల సంరక్షణ కారణంగా వచ్చిన వృత్తి విరామాలను ఈ వ్యవస్థలు పరిగణనలోకి తీసుకోవడం లేదని, అనుభవాన్ని పరిమితంగా మాత్రమే అంచనా వేస్తున్నాయని నివేదిక పేర్కొంది.
Artificial Intelligence వల్ల అంతరించిపోయే జాబ్స్..
రాబోయే పదేళ్లలో టెక్, ఆర్థిక, వృత్తిపరమైన సేవల రంగాల్లో దాదాపు 1.19 లక్షల క్లరికల్ ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల అంతరించిపోయే అవకాశముందని అంచనా వేశారు. ఈ ఉద్యోగాల్లో ఎక్కువ భాగం మహిళలే నిర్వహిస్తున్న నేపథ్యంలో, పెద్ద సంఖ్యలో మహిళలు ఉద్యోగ నష్టాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని నివేదిక స్పష్టం చేసింది.
అయితే, ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించడంపై సంస్థలు దృష్టి సారిస్తే, తొలగింపు చెల్లింపుల రూపంలో సుమారు 757 మిలియన్ల పౌండ్ల వరకు ఖర్చును ఆదా చేయవచ్చని నివేదిక తెలిపింది. గత సాంకేతిక అనుభవం కంటే అభ్యర్థుల సామర్థ్యం, అనుకూలతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించింది.
టెక్నాలజీ రంగానికి మహిళల గుడ్ బై..
పదోన్నతి అవకాశాలు లేకపోవడం, గుర్తింపు కొరత, తగిన వేతనాలు అందకపోవడం వంటి కారణాల వల్ల ప్రతి సంవత్సరం సుమారు 60,000 మంది మహిళలు టెక్నాలజీ రంగాన్ని విడిచిపెడుతున్నారని అంచనా వేయబడింది. ఇది డిజిటల్ ప్రతిభ లోటును మరింత తీవ్రమయ్యేలా చేస్తోందని నివేదిక పేర్కొంది.
సిటీ ఆఫ్ లండన్ మేయర్ డేమ్ సూసన్ లాంగ్లీ మాట్లాడుతూ, ప్రజలపై పెట్టుబడి పెట్టడం ద్వారా అపారమైన ప్రతిభను వెలికితీయవచ్చని అన్నారు. డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధికి మద్దతు ఇవ్వడం వల్ల బలమైన, స్థిరమైన బృందాలు ఏర్పడతాయని ఆమె పేర్కొన్నారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే..
నివేదిక ప్రకారం, 2024లో మాత్రమే ఈ రంగాల్లో 12,000కు పైగా డిజిటల్ ఉద్యోగాలు భర్తీ కాకుండా ఖాళీగానే ఉన్నప్పటికీ, మహిళలను ఉద్యోగాల కోసం పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదని తేలింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2035 వరకు డిజిటల్ ప్రతిభ అంతరం కొనసాగి, యుకే ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
-
2030 నాటికి ఏఐ దెబ్బకి ఆ సెక్టార్లో ఉద్యోగాలు ఖాళీ..? -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!!












Click it and Unblock the Notifications