విశ్వవిజేత భారత్.. జయహో వండర్ వుమెన్
అండర్ -19 ఉమెన్స్ టీ20 లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. 2025 వరల్డ్ కప్ లో గెలిచింది. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ 9 వికెట్ల తేడాతో అఖండ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ సాధించిన సఫారీ జట్టు కేవలం 82 పరుగులకే ఆలౌటైంది. మన బౌలర్లు సఫారీ జట్టుపై విజృంభించారు.త్రిష 3, పరునిక, ఆయూషి, వైష్ణవి తలో 2, షబ్నమ్ 1 వికెట్ దక్కించుకున్నారు.దీంతో సౌతాఫ్రికా జట్టు కేవలం 82 పరుగులే చేసి ఆలౌట్ అయింది.
ఇక సఫారీలు నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 11.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించారు. తొలి ఓవర్లోనే 18 పరుగులు రాబట్టారు. తెలుగమ్మాయి గొంగడి త్రిష (44 పరుగులు; 33 బంతుల్లో: 8x4) దూకుడుగా ఆడి అదరగొట్టింది. సనికె చక్లె (26 పరుగులు)కూడా రాణించింది. సౌతాఫ్రికా బౌలర్లలో రెనెకె 1 వికెట్ దక్కించుకుంది.

ఈ విజయంతో భారత్ రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది.తెలుగు క్రీడాకారిణి గొంగడి త్రిష టోర్నీ మొత్తం బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటింది.












Click it and Unblock the Notifications