Rana vs Rathi:దిగ్వేష్ రాతీ ఇక మారడా..మళ్లీ గొడవ (వీడియో)..!!
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్... పేరుకు ఎలిమినేటరే కానీ, ఇది ఆటగాళ్ల మధ్య వైరం, వాగ్వాదాల యుద్ధరంగంలా మారిపోయింది. వెస్ట్ ఢిల్లీ లయన్స్, సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ మధ్య జరిగిన ఈ పోరులో, నితిష్ రాణా అద్భుతమైన సెంచరీ సాధించినా, ఆటగాళ్ల మధ్య జరిగిన ఘర్షణలే ప్రధానాంశంగా నిలిచాయి. క్రికెట్ మైదానంలో పరుగుల వర్షం కురిసినా, అంతకు మించి మాటల తూటాలు పేలాయి.
ఆవేశం.. ఆగ్రహం.. వాగ్వాదాల సునామీ!
ఈ మ్యాచ్లో అత్యంత వేడిగా మారిన ఘట్టం వెస్ట్ ఢిల్లీ ఆటగాడు నితిష్ రాణా, సౌత్ ఢిల్లీ స్పిన్నర్ దిగ్వేష్ రాతీ మధ్య జరిగింది. రాతీ బౌలింగ్కు వచ్చిన క్షణం నుంచే ఇద్దరి మధ్య కళ్లలో ఆవేశం కనిపించింది. రాణా ఒక భారీ సిక్స్ కొట్టడంతో రాతీకి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే నోటి నుంచి దుర్భాషలు రావడంతో, రాణా ఆగ్రహంతో బౌలర్ వైపు దూసుకెళ్లాడు. ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగిపోవడంతో అంపైర్లు, ఇరు జట్ల సహచర ఆటగాళ్లు వచ్చి వారిద్దరినీ విడదీసి శాంతింపజేయాల్సి వచ్చింది.

ఈ డ్రామా ఇక్కడితో ఆగిపోలేదు. తర్వాత 11వ ఓవర్లో, వెస్ట్ ఢిల్లీ ఆటగాడు కృష్ణ యాదవ్ ఔటయ్యాడు. కానీ, పెవిలియన్కు వెళ్లడానికి బదులుగా, బౌలర్ అమన్ భారతితో, ఒక ఫీల్డర్తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈసారి పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో నితిష్ రాణా తానే రంగంలోకి దిగి తన సహచరుడిని శాంతపరిచాడు. ఈ మొత్తం ఘర్షణల్లో, రాణా మాత్రం తన బ్యాట్తోనే జవాబిచ్చాడు. కేవలం 55 బంతుల్లో 15 సిక్స్లు, 8 ఫోర్లతో 134 పరుగులు చేసి, జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. దీంతో 202 పరుగుల భారీ లక్ష్యం కూడా 17.1 ఓవర్లలోనే పూర్తైంది. రాణా విధ్వంసంతో దిగ్వేష్ రాతీ తన రెండు ఓవర్లలోనే ఏకంగా 39 పరుగులు సమర్పించుకున్నాడు.
It’s all happening here! 🔥🏏
— Delhi Premier League T20 (@DelhiPLT20) August 29, 2025
Nitish Rana | Digvesh Singh Rathi | West Delhi Lions | South Delhi Superstarz | #DPL #DPL2025 #AdaniDPL2025 #Delhi pic.twitter.com/OfDZQGhOlr
గతంలోనూ ఇలాంటి వివాదాలు..
క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధాలు, వాగ్వాదాలు కొత్తేమీ కాదు. గతంలో పలువురు భారత క్రికెటర్లు కూడా ఇలాంటి వివాదాల్లో భాగమయ్యారు.
- కోహ్లీ-గంభీర్ (ఐపీఎల్ 2023): ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన గొడవ అందరినీ షాక్కు గురి చేసింది. మ్యాచ్ తర్వాత ఇద్దరూ తీవ్రమైన వాగ్వాదానికి దిగగా, తోటి ఆటగాళ్లు వారిని విడదీశారు.
- హర్భజన్-శ్రీశాంత్ 'స్లాప్ గేట్' (ఐపీఎల్ 2008): ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద సంఘటన ఇది. మ్యాచ్ ఓటమి తర్వాత హర్భజన్ సింగ్, శ్రీశాంత్ను చెంపపై కొట్టడం అప్పట్లో పెను దుమారం రేపింది. శ్రీశాంత్ కన్నీళ్లు పెట్టుకోవడం, హర్భజన్పై నిషేధం పడటం అప్పట్లో క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్.
- ఇషాంత్-సైమండ్స్: 2008లో ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో ఇషాంత్ శర్మ, ఆండ్రూ సైమండ్స్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తర్వాత జాతి వివక్ష ఆరోపణలు రావడంతో ఈ వివాదం మరింత పెద్దదైంది.
-
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications