అభిమానుల ప్రాణాలు పోయినా వేడుకలా...? సిగ్గుండాలి
ఐపీఎల్ ట్రోఫీని ఎట్టకేలకు ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానుల ఆనందం క్షణికావేశంలోనే కన్నీటి సంద్రంగా మారింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఘోర తొక్కిసలాటలో 11 మంది అమాయక అభిమానులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దశాబ్దాల కలను సాకారం చేసుకున్న సంతోషం, అకస్మాత్తుగా జరిగిన విషాదాంతంగా మారింది.
#WATCH | Virat Kohli praises #RoyalChallengersBengaluru captain Rajat Patidar as RCB ended their 18-year-long wait and won their maiden IPL trophy yesterday after defeating Punjab Kings
— ANI (@ANI) June 4, 2025
"He will lead us for a long time," says Virat Kohli
(Visuals from M Chinnaswamy Stadium in… pic.twitter.com/V1W8GrR5Qg
అనూహ్యంగా ఐపీఎల్ టైటిల్ను గెలుచుకున్న ఆర్సీబీకి స్వాగతం పలికేందుకు, విజయోత్సవ వేడుకలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్దకు చేరుకున్నారు. అభిమానుల రద్దీని నియంత్రించడంలో లోపాలు తలెత్తడంతో ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. 100 మందికి పైగా గాయాలు అయినట్టు తెలుస్తోంది.

అయితే ఈ ఘోరం జరిగినప్పటికీ, ఆర్సీబీ టీం తమ విజయోత్సవ వేడుకలను నిలిపివేయకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. స్టేడియం వెలుపల అభిమానులు ప్రాణాలు కోల్పోతుంటే, లోపల సంబరాలు కొనసాగించడంపై నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కోహ్లీని టార్గెట్ చేసుకుంటూ క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.
#WATCH | "RCB, RCB" echoes through the M Chinnaswamy Stadium in Bengaluru as #RoyalChallengersBengaluru fans turn up in huge numbers to welcome their champion team here pic.twitter.com/FzgvB0ZtZK
— ANI (@ANI) June 4, 2025
ఆర్సీబీ యాజమాన్యం, ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కప్పు గెలిచిన ఆనందం, దాని కోసం ప్రాణాలు కోల్పోయిన అభిమానుల జీవితాల కన్నా గొప్పదా? అనే ప్రశ్న ఇప్పుడు ఆర్సీబీని వెంటాడుతోంది. ఈ సంఘటన భారత క్రీడా చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది.
Allu Arjun was arrested over one death in a stampede at his event in Telangana. — So, who is responsible for the 11 deaths reported so far during the RCB's IPL victory celebration? #chinnaswamystadium #Stampede #Bangalorepic.twitter.com/0alu2MxAtE
— A D V A I T H (@advaithspeaks) June 4, 2025
ఈ ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం క్షమాపణలు చెప్పగా, ముఖ్యమంత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడ్డవారిని పరామర్శించారు. ఈ ఘటన బెంగళూరు నగరాన్ని విషాదంలో ముంచెత్తింది. అభిమానుల ఆనందం క్షణాల్లోనే తీరని విషాదంగా మారడంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications