ఎన్టీఆర్ గుర్తున్నాడా?
హోంపేజి టాక్ ఆఫ్ టుడే రాజకీయాలు Monday, March 29 2004 ;?
హైదరాబాద:నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకదినం. సరిగ్గా ఇర వై రెండేళ్ళ క్రితంపార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ర పెట్టుకున్న లక్ష్యాలుఇప్పుడు ఆపార్టీలో మిగిలి ఉన్నాయా అన్నది పెద్ద ప్రశ్న.సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్ళుఅన్నది ఆనాడు రామారావు నినాదం. అప్పటికీఇప్పటికీ ఎంతతేడా?
ప్రపంచవ్యాప్తంగాఅనేక మార్పులు చోటుచేసుకున్ననేపధ్యంలో రామారావు ఇప్పుడు ముఖ్యమంత్రిగాఉన్నా ఆ సంక్షేమ పథకాలన్నిటినీ కొనసాగించడంసాధ్యమయ్యేది కాదేమో. అయినా పరిస్ధితిమరీ ఇంత దారుణంగా ఉండేది కాదని ఖచ్చితంగాచెప్పవచ్చు. బడుగు వర్గాల సంక్షేమకార్యక్రమాల మీద ఆయనకు అంత శ్రద్ధఉండేది.
ప్రపంచబ్యాంకుఅప్పులు, వారి షరతుల కారణంగా సబ్సిడీలమీద సంక్షేమ పథకాల మీద కోత విధించాల్సివచ్చింది. ఫలితంగా పల్లె సీమలు వట్టిపోతున్నాయి.ధనికులు మరింత ధనికులుగా పేదలుమరింత పేదలుగా మారిపోతున్నారు. అవిద్య,పేదరికం ఉన్న దేశంలో అగ్రదేశాలవిధానాలను అనుసరించడం వల్ల వ్యతిరేకఫలితాలు వస్తున్నాయి.
రామారావుహయాంలో బలహీనవర్గాల్లో చైతన్యంవచ్చింది. రాజకీయాధికారం వారికి అందింది. చంద్రబాబునాయుడు అమలు చేస్తున్న పథకాలు తెలుగుదేశంకార్యకర్తలకు కమ్మగా ఉంటున్నా సామాన్యులకుఅందడం లేదు. కార్యకర్తలు, కాంట్రాక్టర్లు,రాజకీయ బ్రోకర్లు, అవినీతిపరులైన అధికారులుఈనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో బాగుపడుతున్నారన్నఅభిప్రాయం ఉంది.
ఆనాటిసామ్యవాద విధానాలు తెలుగుదేశంలో చోటుచేసుకోవాల్సి ఉంది.