సూరి ఒక్కరేనా?:భానుమతి
హైదరాబాద్:సూరి ఒక్కడేనా అని మద్దెలచెర్వుసూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరిభార్య భానుమతి అంటున్నారు.తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాలరవి హత్య కేసులో సూత్రధారి సూరి అనిఅందరూ అంటున్నారని అన్నప్పుడు ఆమె సూరిఒక్కడేనా అని అన్నారు. బెంగుళూర్లో ఉన్నభానుమతిని ఒక ప్రైవేట్ తెలుగు టీవీచానల్ ఇంటర్వ్యూ చేసింది. పరిటాల రవిహత్యకు ముందు మీరు అజ్ఞాతంలోకిఎందుకు వెళ్లారని అడిగితే తానేమీఅజ్ఙాతంలోకి వెళ్లలేదని, తమఅమ్మకు బాగా లేకపోతే బెంగుళూర్వచ్చానని ఆమె చెప్పారు.
శాసనసభఎన్నికల్లో భానుమతి పెనుకొండనియోజకవర్గంలో పరిటాల రవిపై కాంగ్రెస్అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పరిటాలరవి హత్య కేసులో భానుమతిని కూడాఅరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీనాయకులు డిమాండ్ చేస్తున్నారు.
పరిటాలరవి హత్య కేసులో సూరి ప్రధానసూత్రధారి అని అందరూ అంటున్నారని టీవీఛానల్ ప్రతినిధి అన్పప్పుడు తనకుతెలియదని ఆమె చెప్పారు. చాలా మందితోసూరి ఫోన్లో మాట్లాడారట అని అంటే తనకుతెలియదని జవాబిచ్చారు. ఎప్పుడో ఒకసారితనతో ఫోన్లో మాట్లాడేవారని ఆమెచెప్పారు. అమ్మకు బాగైన తర్వాతరెండు మూడు రోజుల్లో బెంగుళూర్నుంచి వస్తానని ఆమె చెప్పారు.కావాలంటే తనను ప్రశ్నించవచ్చుననికూడా ఆమె అన్నారు.