కెసిఆర్ ఇప్పుడేమంటారు?
హోంపేజి టాక్ ఆఫ్ టుడే కాంగ్రెస్ Tuesday, February 08, 2005
ఢిల్లీ పిలుపు ఒకమలుపు!
హైదరాబాద్:వారం రోజుల పాటు చైనాలో పర్యటించి వచ్చినముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికిఅధిష్టానవర్గం నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల పదినుంచి రెండు రోజులు ఆయనఢిల్లీలో ఉంటారు. ఈ పిలుపు రొటీన్ కాదని,వైఎస్ను కొన్ని అంశాలపై అధిష్టానవర్గంప్రశ్నించనుందని అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.ఆంధ్రప్రదేశ్ను తమ అదృష్టరేఖగాభావిస్తున్న కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికిఇటీవలి పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో పరిపాలనసమర్ధంగా సాగడంలేదని, వైఎస్కోటరీయే పనులు చక్కబెట్టుకుంటున్నదనికాంగ్రెస్ వర్గాల నుంచే అధిష్టానవర్గానికి ఫిర్యాదులు అందాయి.
రాష్ట్రంలోనక్సలైట్లతో శాంతి చర్చలువిజయవంతమైతే, మిగితా రాష్ట్రాల్లో కూడా ఆ ప్రక్రియను చేపట్టాలని కాంగ్రెస్అగ్ర నాయకత్వం ఆశించింది. చర్చలు విఫలంకావడానికి రాష్ట్ర ప్రభుత్వ ధోరణేకారణమని కేంద్రమంత్రులు కె.చంద్రశేఖరరావు,దాసరి నారాయణరావు, సీనియర్ కాంగ్రెస్నాయకుడు జి.వెంకటస్వామి సోనియాగాంధీకి చెప్పారు. శాంతి కాముక మతానికి(క్రిస్టియానిటీ) చెందిన సోనియాగాంధీ నక్సలైట్లతో చర్చలువిజయవంతం కావాలని ప్రార్ధనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. అటువంటివాతావరణాన్ని వైఎస్ నిర్లక్ష్యంకారణంగా చెడగొట్టారని, పోలీసు యంత్రాంగం ఆయనఅదుపులో లేకుండా పోయిందని ఆమెకు ఫిర్యాదులు అందాయి.అయితే ఇది పూర్తిగా నిజం కాదు. ఆయనకు పోలీసుయంత్రాంగంపై నియంత్రణలేకపోతే ప్రత్యర్ధి పార్టీల నాయకులహత్యలు బహిరంగ ప్రదేశాల్లో జరిగి ఉండేవికావు.
ఒక వ్యూహంప్రకారమే వైఎస్ కోటరీ నక్సలైట్లతో చర్చల ప్రక్రియకు విఘాతం కలిగించింది.నక్సలైట్లతో చర్చలు ప్రారంభించినరోజునే వైఎస్ ప్రభుత్వానికి ఒక విషయంస్పష్టంగా తెలుసు. అది రెండో విడత చర్చలు ఉండవని. ఎన్నికలముందుతెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కాంగ్రెస్కు నక్సలైట్లుపరోక్ష మద్దతు ఇచ్చారన్నది బహిరంగ రహస్యం.చర్చల ద్వారా సాధించేదేమీ ఉండదని ఇరుపక్షాలకూతెలుసు. ఇప్పుడు చంద్రబాబు పేరు కంటేముందు వైఎస్ పేరు నక్సలైట్ల హిట్లిస్టులో ఉంది.
ఇక ఉచిత విద్యుత్విషయంలో మాట తప్పడంఅధిష్టానవర్గానికి ఇష్టం లేదు. ఈ విషయంలో వైఫల్యం వైఎస్అసమర్ధతేనని అధిష్టానవర్గం భావిస్తున్నట్టు సంకేతాలువస్తున్నాయి. నిజానికి ఉచిత విద్యుత్ ఆచరణ సాధ్యంకాదని, దానిని ఎన్నికల ఎజెండాలో పెట్టవద్దనిఅధిష్టానవర్గం ఎన్నికల ముందే రాష్ట్రకాంగ్రెస్ నాయకలకు సూచించింది. అయితేఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక పరిస్ధితులుఉన్నాయని, రైతుల ఆత్మహత్యలుఅధికంగా జరుగుతున్నాయని, ఉచితవిద్యుత్కు అయ్యే దాదాపు నాలుగువందల కోట్ల రూపాయలను ప్రభుత్వం భరించగలదని రాష్ట్రనాయకులుబలంవంతంగా అధిష్టానవర్గాన్నిఒప్పించారు. ఉచిత విద్యుత్ విషయంలో ఈ దాగుడుమూతలేమిటని సోనియా గాంధీవైఎస్ను నిలదీసే అవకాశముంది.వైఎస్కు సూచనలు, హెచ్చరికలు ఉంటాయేగానీ ఆయనను మార్చే విషయంఅధిష్టానవర్గం దృష్టిలో లేదన్నదిస్పష్టం. ఇటువంటి హెచ్చరిక సమావేశాలుకనీసం మూడు జరిగిన తర్వాత కానీ మార్పువిషయం పరిశీలనకు రావు.
ఒకవిషయం మాత్రం స్పష్టం. చంద్రబాబు నాయుడుపైకి గంభీరంగా కన్పించే పిరికి వ్యక్తి. వైఎస్ పైకిభయం భయంగా కన్పించే మొండివ్యక్తి. వైఎస్ కు కొన్ని విషయాల్లో విపరీతమైన పట్టుదల ఉంది. ఆవిషయాల్లో ఆయన అధిష్టానవర్గానికి కూడాభయపడే రకం కాదు. రానున్నఆరు నెలలు ఆయనకు పరీక్షాకాలం.
చేతులెత్తేస్తున్నప్రభుత్వం
వైఎస్
భయాలు,
భ్రాంతులు!
కాంగ్రెస్జేబులో
మోహన్బాబు?
కాంగ్రెస్సర్కారా?
కాంట్రాక్టర్ల
సర్కారా?
ఒక
అడుగు
ముందుకు,రెండు
వెనక్కి!
పవర్
ప్లస్
పవర్
సమాంతర
శక్తులు!
ఇందిరమ్మ
భూమి
ఇదొక
రాజ్యకీయం.
అవినీతి
వికేంద్రీకరణ
కాంగ్రెస్-టిఆర్ఎస్
కటీఫ్?
సోదరహాసం
వైఎస్
అసహనం
కప్పల
తక్కెడ
మూడో
పవర్ఫుల్
లేడీ
టికెట్-క్యాన్సిల్-ఒకతెలుగమ్మాయి
బాలకృష్ణ
ఇంటిదొంగలేనా?
మంద
భాగ్యనగరం
తెలంగాణకు
ఎర్ర
జెండా
ఛానళ్ళా?
చేపల
చెరువులా?
టిఆర్ఎస్లో
ముసలం?
వార్
బహుముఖ
విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక
వ్యూహం!
ఐటీ
మీద
వైఎస్
దృష్టి
త్తెకాలపు
సత్తెన్న
హోంపేజి