వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు వ్యూహం ఫలిస్తుందా?

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
గత కొన్ని రోజులుగా ఏ ఛానెల్లోనూ,పేపర్లోనూ చిరంజీవి ఊసే లేదు. దానికి కారణం రోడ్ షోలకు అర్ధాంతర బ్రేకు. ఊహించని ఈ పరిణామానికి చిరు శిబిరం కంగారు పడ్డా మరో సరి కొత్త వ్యూహం తో రంగంలోకి దూకుతున్నారు. తాడి తన్నే వాడుంటే తల తన్నే వాడుంటారనేది ఇప్పుడు పాలిటిక్స్ లోనూ వర్కవుట్ అవుతూ రుజువు అవుతోంది. వాస్తవానికి ఎత్తులకు పై ఎత్తులు వేయటం రాజకీయాల్లో కొత్తేం కాదు. అయితే ఇప్పుడిప్పుడే రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్న చిరంజీవి తనకు పడిన రోడ్ షో బ్రేక్ అనే ట్విస్టు కు సరికొత్త వ్యూహం తో సమాధానం చెప్పబోవటం రాజకీయం వర్గాల్లో చర్చగా మారింది. రాజకీయ పార్టీల రోడ్‌ షోలకు హైకోర్టు బ్రేక్‌ వేయడంతో టిఆర్‌ఎ స్‌ అధ్యక్షుడు కెసిఆర్‌, పిఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి వ్యూహం మార్చారు.

రోడ్‌షోలకు ప్రత్యా మ్నయంగా దీటైన ప్రచారం నిర్వహించడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కెసిఆర్‌ నియోజక వర్గానికో బహిరంగ సభ, చిరు సహపంక్తి భోజనాలు తెరపైకొచ్చాయి.రోడ్‌ షోలకు కోర్టు బ్రేక్‌ వేయడంతో అర్థాంతరంగా ఆగిపోయిన ప్రచారాన్ని ఏదో రూపంలో తిరిగి ప్రారంభించాలని కెసిఆర్‌ తలంచారు. దీనితో నియోజకవర్గానికో బహిరంగ సభ పేరుతో భారీ ప్రచారానికి తెరతీస్తే చిరంజీవి సహపంక్తి భోజనాల ద్వారా ప్రజల మధ్యకు వెళ్ళాలని నిర్ణయించారు. ఈ మేరకు రేపు మెదక్‌ జిల్లా సింగన్నగూడెంలో పంక్తి భోజనం చేయనున్నారు. దీనికోసం స్థలాన్ని నిర్ణయించేందుకు ఆ పార్టీ నేత హరిరామజోగయ్య ఈరోజు గజ్వేల్‌, పటాన్‌చెరు, ఆంథోల్‌ నియోజకవర్గాల్లో పర్యటించారు.మరి ఈ ఎత్తు ఫలిస్తే...చిరుకు కొంత ఊరట లభించినట్లే..కాంగ్రేస్, తెలుగు దేశం వారు మరో ప్రత్యన్నమ్మాయం ఎతుక్కోవాల్సిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X