కాంతి కోల్పోయిన చంద్రుడు

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడ్డదారిలో లాభం పొందిన బిల్లీరావు వంటి వారు గోడ మీద పిల్లిలా వ్యవహరించినా వైఎస్ కోటరీ వారిని దగ్గరికి రానివ్వలేదు. వైఎస్ ప్రభుత్వం అవినీతి మయమంటూ చంద్రబాబు నాయుడు స్వయంగాను, తన మీడియా సంస్ధల ద్వారాను ప్రచారం చేసినా జనం పెద్దగా స్పందించలేదు. వైఎస్ సంక్షేమ, అభివృద్ధి పథకాలు జనంలో బాగా పనిచేశాయి. వైఎస్ ఆచరణాత్మకంగా వ్యవహరించగా, చంద్రబాబు నాయుడు అరచేతిలో వైకుంఠం చూపించినట్టు నడుచుకున్నారు. ఈ తేడాను కామన్ సెన్స్ ఉన్న కామన్ ప్రజలందరూ గ్రహించారు.
తెలుగుదేశం పార్టీకి మూలస్తంభంగా ఉన్న ఈనాడు అధినేత రామోజీరావును వ్యూహాత్మకంగా దెబ్బతీయడం ద్వారా ఎన్నికల ముందే వైఎస్ ఉండవల్లి ద్వారా విజయం సాధించారు. ఆంధ్రజ్యోతి మీద కూడా వత్తిడి తేగలిగారు. అన్నిటికంటే మించి కమ్మవారిలో చీలిక తేగలిగారు. చంద్రబాబు నాయుడు తన జీవిత కాలంలో అనుసరించలేని వ్యూహాలు కాంగ్రెస్ లో అమలులోకి వచ్చాయి.
ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మార్చుకోవడం కంటే తమ వ్యాపార వ్యూహాలను మార్చుకుని కాంగ్రెస్ లో ఉన్న కమ్మ నాయకులను పట్టుకుని పనులు చేయించుకోవడమే ఉత్తమమని కొందరు టిడీపి సానుభూతిపరులైన వ్యాపారులు భావిస్తున్నట్టు సమాచారం. అంటే పరిస్ధితి 1982 లో తెలుగుదేశం ఆవిర్భవించక ముందు ఉన్నదన్న మాట. ఆ కాలంలో కమ్మ వ్యాపార, వాణీజ్య వేత్తలకు కాంగ్రెస్ నాయకుల ద్వారానే తమ పనులు చేయించుకునేవారు.
చంద్రబాబు నాయుడు హయాంలో కమ్మ కాంట్రాక్టర్ల కంటే రెడ్లదే పైచేయి అని కమ్మవారి ఆవేదన. బాబు అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి కాంట్రాక్టర్లకు భయపడి కమ్మ వారిని కూడా కాదని టెండర్లను అమోదించేవారని ఒక వాదన. కాంగ్రెస్ హయాంలో ఎటూ రెడ్లదే హవా, తెలుగుదేశంలో కూడా వారిదే అయినప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మార్పు ఎలా సాధ్యమని కుల సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఇక ముగింపు ఏమిటంటే తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వారు మెల్లగా తమ విధేయతలను అధికార పార్టీ వైపు మళ్ళిస్తున్నారు. సుజన చౌదరి అయినా, బిల్లీ రావు అయినా ఇందుకు మినహాయింపు కాదు.












Click it and Unblock the Notifications