సమరం వెనుక సారధి!

చిరంజీవికి, మోహన్ బాబుకు మధ్య ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలు గత కొంతకాలంగా జరుగుతూనే ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ ఉత్సవాల సందర్భంగా ఆ వేదిక మీద మోహన్ బాబు చిరంజీవి లెజెండా, సెలబ్రిటీనా అని ప్రశ్నించడం వివాదానికి దారి తీసింది. దానిపై ఆనాడు పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు.
గురువు దాసరి నారాయణరావు కనుసైగ చేయకుండా మోహన్ బాబు చిరంజీవిపై కామెంట్స్ చేయడానికి సాహసించరని తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్లు అందరికీ తెలుసు. కాపు కులానికి చెందిన దాసరి నారాయణరావు ఆ కులం బలంతోనే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు కాగలిగారు. కొంతకాలం కేంద్ర సహాయ మంత్రిగా పనిచేయగలిగారు. తన కులం నుంచి వచ్చి సొంతపార్టీ పెట్టుకున్న చిరంజీవి వల్ల తాను రాజకీయంగా వీక్ అవుతానన్న భావన మొదటి నుంచి దాసరికి ఉంది. అయితే చిరంజీవి పార్టీ విజయం కాకపోవడం దాసరి వర్గానికి ఆనందం కలిగించి ఉంటుంది.
ఇప్పుడు చిరంజీవి మీద విమర్శలు చేసి, ఆయన చర్యలను ప్రజలు క్షమించరని మోహన్ బాబుతో చెప్పించడం ద్వారా దాసరి చిరంజీవి మీద మరో చిరు విజయం సాధించారు. సినిమా వాళ్ళు, కాపు కులస్ధులు చిరంజీవి వెనుక పెద్దగా లేరన్న సంకేతాన్ని మోహన్ బాబు ద్వారా దాసరి కాంగ్రెస్ అధిష్టానానికి, సామాన్య జనానికి ఇవ్వగలిగారు.
నిశితంగా పరిశీలిస్తే ఈ వివాదం ఇంతటితో సమసిపోయేలా లేదు. అన్నయ్య మీద ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే ఒంటికాలి మీద లేచి విమర్శించే పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. పవన్ నిర్వేదానికి కారణాలు తెలియవలసి ఉంది.
నేను ఏమన్నానో, నువ్వు ఏమన్నావో తేల్చుకుని క్షమాపణలు చెప్పుకోవడానికి పబ్లిక్ లోకి రా అని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు చిరంజీవికి సవాల్ విసిరారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఆయన బుధవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను ఎవరినైనా అనదలుచుకుంటే నేరుగా అంటానని, డొంక తిరుగుడుగా మాట్లాడే అలవాటు తనకు లేదని, అంతటి పిరికిపందను కానని ఆయన అన్నారు.
చిరంజీవి సాఫ్ట్ కాబట్టి ఈ వ్యాఖ్యల మీద సాఫ్ట్ గానే స్పందిస్తారు. పవన్ కల్యాణ్ అయితే పచ్చి మిర్చిలాగా ఘాటుగా స్పందించేవారు. ఆయన రేపైనా కనీసం పత్రికా ప్రకటన ద్వారా అయినా స్పందిస్తారని చిరు-పవన్ అభిమానులు ఆశతో ఉన్నారు.
-
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications