వ్యాపారాల్లోనూ నాగార్జున ఘటికుడే

నాగార్జున పెద్ద భూ బకాసురుడని కెసీఅర్ ఇటీవల అరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డులో తన భూములను రెగ్యులరైజ్ చేసుకోడానికి నాగార్జున ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు కట్టాడన్న విషయాన్ని టీఅర్ ఎస్ నాయకులు బయటికి తెచ్చారు. తన భూములను కాపాడుకోడానికి నాగార్జున దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కు అనుకూలంగా మారారు. వైఎస్ పథకాలను అనేక మీడియాల ద్వారా, యాడ్స్ ద్వారా ప్రచారం చేశారు. తన కులానికే చెందిన చంద్రబాబు నాయుడికి కోపం వస్తుందని తెలిసినా నాగార్జున తన వ్యాపార, ఆస్ధి ప్రయోజనాల కోసం ఇలా చేశారన్న విమర్శ ఉంది.
తాజాగా తన సినిమా టైటిల్ ను ముందుగానే రిజిస్టర్ చేసుకున్న ఒక సినిమా సంస్ధపై ఆరోపణలు చేసి నాగార్జున మరింత భ్రస్టు పట్టారు. "రమ్మి" టైటిల్ వేరొకరు రిజిస్టర్ చేసుకున్నారని తెలుసుకున్న నాగ్ "మోసగాడు" టైటిల్ అనుకున్నారు. చివరికి ఆ టైటిల్ మరొక రకంగా మారింది. తాము "రమ్మి" టైటిల్ కోసం 12 లక్షలు డిమాండ్ చేశామని నాగార్జున ఆరోపించడంపై ఐనెక్స్ కలర్స్ అనే సినిమా సంస్ధ ప్రతినిధి సుధాకర్ మండిపడ్డారు. ఈ సినిమాపై తాము ఇప్పటికే పాతిక లక్షలు ఖర్చు పెట్టామని, నాగార్జున చెబుతున్న ఆ ముష్టి 12 లక్షలకు ఆశపడే స్ధాయిలో తాము లేమని సుధాకర్ చెప్పారు.
తాను నెగిటివ్ గా మీడియాలోకి వస్తున్న విషయం గ్రహించిన నాగార్జున మీడీయా ప్రతినిధులను ఎంతో ఖరీదైన మందు విందులను ఇచ్చి లోబరుచుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారమోనన్న అనుమానం ఉన్న నాగార్జున అటువైపు కూడా ఒక కాలు వేయడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. గతంలో ఆ బాధ్యతను తండ్రి నాగేశ్వరరావుకు అప్పగించిన నాగార్జున ఏ నిముషానికి ఏమి జరుగునో అన్న ముందు చూపుతో ఆ బాధ్యతను కూడా తన భుజాల మీద వేసుకుని బహుపాత్రలు పోషిస్తున్నట్టు తెలుస్తోంది. హ్యాట్సాఫ్ నాగార్జున!
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications