పురంధరేశ్వరికి బహిరంగలేఖ

2004 ఎన్నికల్లో కమ్మ కులస్ధులు కూడా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికి ఒక కారణం దగ్గుబాటి దంపతులు చంద్రబాబు నాయుడితో వేగలేక కాంగ్రెస్ లో చేరడం. కోస్తా ఆంధ్రలో కమ్మవారు చంద్రబాబు మీద ఆగ్రహంతో మరో దిక్కులేక కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు.
సరే, ఒకే కుటుంబంలోని వారు వివిధ పార్టీల్లో ఉండవచ్చా? తద్వారా వారు తమ కుటుంబ ఆధిపత్యాన్ని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొనసాగిస్తున్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడికి సహకరించారనడం జగమెరిగిన సత్యం. ఆనాడు చంద్రబాబుకు మద్దతు ఇవ్వమంటూ దగ్గుబాటికి వీరతిలకం పెట్టి వైస్రాయ్ హోటల్ కు పంపిన పురంధరేశ్వరి ఈనాడు మాటి మాటికీ ఎన్టీఆర్ ను గుర్తుచేసుకోవడం దారుణం.
చంద్రబాబు నాయుడి రాజకీయ స్వార్ధం గురించి అందరికీ తెలుసు. సొంత జిల్లాలో తమ్ముడు రామూర్తి నాయుడి ఎదుగుదలను కూడా తట్టుకోలేని నైజం ఆయనది. ఇక తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు శ్రేయస్సును ఆయన ఎందుకు కోరుకుంటారు? అందువల్లనే కమ్మ పెద్దలు ఒక సిండికేట్ గా ఏర్పడి సోనియా గాంధీతో మాట్లాడి దగ్గుబాటి దంపతులకు కాంగ్రెస్ పార్టీలో ఒక గౌరవనీయమైన స్ధానం కల్పించారు.
అయితే ఒక పెద్ద కుటుంబంలోని వారు రెండు ప్రత్యర్ధి పార్టీల్లో పెత్తనం చెలాయిస్తూ, అంతర్గతంగా కలిసి ఉండడం సామాన్య ప్రజలను మోసగించడం కాదా? జనం ఎవరిని నమ్మాలి? దీని మీద చర్చ జరగాల్సిన అవసరముంది.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఏపీ వాసుల కోసం బాలకృష్ణ తీపికబురు.. త్వరలో తుళ్ళూరులో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications