పురంధరేశ్వరి సమస్య

ఎన్టీఆర్ కుటుంబంలో అందరి నోటా "చిన్నమ్మ" అని పిలిపించుకునే దగ్గుబాటి పురంధరేశ్వరి రాజకీయాల్లో అంత ఎత్తున ఎదిగి ఇప్పుడు నేల చూపులు చూడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడానికి ఎన్టీఆర్ కొడుకులను, అల్లుడు దగ్గుబాటిని దగ్గర చేసుకున్న చంద్రబాబు ఆ తర్వాత హరికృష్ణను, దగ్గుబాటిని దూరం చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ కు బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీలోకి దగ్గుబాటి దంపతులు చేరిపోయి ప్రజాసేవ చేస్తున్నారు. భార్య ఎంపీగా, భర్త ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఎంతో అధ్యయనం, అనుభవం గల పురంధరేశ్వరి ఎంపీ అయిన కొంత కాలానికే కేంద్ర సహాయ మంత్రి ఆయ్యారు. సోనియా గాంధీ కుటుంబానికి చేరువయ్యారు. మంచి ప్రసంగాలు చేసి గొప్ప పార్లమెంటేరియన్ గా పేరు తెచ్చుకున్నారు. అయినా ఆమెకు ఇప్పుడు వచ్చిన టికెట్ సమస్యని హైకమాండ్ తీర్చలేకపోతోంది.
చివరిగా ఒక్క మాట: ఆమె ఎన్టీఆర్ కూతురు కాకపోయి ఉంటే వంటింటికో, రత్నాల వ్యాపారానికో పరిమైతమై ఉండే వారు. ఎన్టీఆర్ కూతురు కావడం వల్లనే ఆమెకు జాతీయ స్ధాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర మంత్రి పదవి లభించింది. అయితే వైస్రాయ్ హోటల్ లో ఎన్టీఆర్ కు చంద్రబాబు స్పాట్ పెట్టినప్పుడు భర్త డాక్టర్ దగ్గుబాటికి వీర తిలకం దిద్ది పంపించిన ఘనత పురంధరేశ్వరిదని విమర్శలు ఉన్నాయి. పురంధరేశ్వరి వల్ల నిజంగా కాంగ్రెస్ లాభపడిందా? గత ఎన్నికల్లో ఓకటి రెండు జిల్లాల్లో ఆ ప్రభావం ఉంటే ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆమె ప్రభావం దాదాపు శూన్యం. ఒకే కుటుంబానికి చెందిన వారు వివిధ పార్టీల్లో చేరి వెలుగులో ఉంటూ మొత్తంగా తమ కుటుంబం శ్రేయస్సు చూసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications