వైఎస్ పంట పండింది!

వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సామాన్య ప్రజల్లో వ్యతిరేకత లేదన్న వాస్తవం ఎన్నికల ఫలితాల్లో బయటపడింది. వైఎస్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు మంచి ఫలితాలనే తెచ్చిపెట్టాయి. పావలాకే మహిళలకు రుణాలు, ఆరోగ్యశ్రీ, వృద్ధాప్యపు పెన్షన్లు, రైతులకు ఉచిత విద్యుత్ తదితర పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఒక రకంగా వైఎస్ పంటపండినట్టే. ఇంతటి పోటీలో ఆయన ఒంటిచేత్తో కాంగ్రెస్ ను విజయతీరాలకు నడిపించారంటే, జనం ఆయన మీద పెట్టుకున్న నమ్మకమే ప్రధాన కారణం. చంద్రబాబు నాయుడు నగదు బదిలీ, ఉచిత కలర్ టీవీల స్కీంలు పెద్దగా పనిచేసినట్టు కన్పించడం లేదు.
వరుసగా ఐదేళ్ళు రుతుపవనాలు బాగా ఉండడం, సరిపడినన్ని వర్షాలు పడడం వైఎస్ కు కలిసొచ్చిన అంశం. చివరి సంవత్సరంలో వర్షాలు సరిగా పడకపోయి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడి ఉండేది. వైఎస్ మొదటి నుంచి వరుణ దేవుడిని నమ్ముకున్నారు. వాన దేవుడు తమ కేబినెట్ లో ఉన్నారని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు.
మరోసారి వైఎస్ ముఖ్యమంత్రి కానున్నట్టు కన్పిస్తోంది. తెలంగాణ విషయంలో తాను తీసుకున్న వైఖరి మంచిదేనని ఆయన ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కు కాలరు ఎగరేసి చెప్పుగల పరిస్ధితి వచ్చింది. వైఎస్ స్ధానంలో బీసీ ముఖ్యమంత్రి అన్న ప్రచారం కూడా ఈ ఫలితాలతో ఎగిరిపోయింది.
-
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..!












Click it and Unblock the Notifications