వైఎస్ పంట పండింది!

వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సామాన్య ప్రజల్లో వ్యతిరేకత లేదన్న వాస్తవం ఎన్నికల ఫలితాల్లో బయటపడింది. వైఎస్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు మంచి ఫలితాలనే తెచ్చిపెట్టాయి. పావలాకే మహిళలకు రుణాలు, ఆరోగ్యశ్రీ, వృద్ధాప్యపు పెన్షన్లు, రైతులకు ఉచిత విద్యుత్ తదితర పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఒక రకంగా వైఎస్ పంటపండినట్టే. ఇంతటి పోటీలో ఆయన ఒంటిచేత్తో కాంగ్రెస్ ను విజయతీరాలకు నడిపించారంటే, జనం ఆయన మీద పెట్టుకున్న నమ్మకమే ప్రధాన కారణం. చంద్రబాబు నాయుడు నగదు బదిలీ, ఉచిత కలర్ టీవీల స్కీంలు పెద్దగా పనిచేసినట్టు కన్పించడం లేదు.
వరుసగా ఐదేళ్ళు రుతుపవనాలు బాగా ఉండడం, సరిపడినన్ని వర్షాలు పడడం వైఎస్ కు కలిసొచ్చిన అంశం. చివరి సంవత్సరంలో వర్షాలు సరిగా పడకపోయి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడి ఉండేది. వైఎస్ మొదటి నుంచి వరుణ దేవుడిని నమ్ముకున్నారు. వాన దేవుడు తమ కేబినెట్ లో ఉన్నారని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు.
మరోసారి వైఎస్ ముఖ్యమంత్రి కానున్నట్టు కన్పిస్తోంది. తెలంగాణ విషయంలో తాను తీసుకున్న వైఖరి మంచిదేనని ఆయన ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కు కాలరు ఎగరేసి చెప్పుగల పరిస్ధితి వచ్చింది. వైఎస్ స్ధానంలో బీసీ ముఖ్యమంత్రి అన్న ప్రచారం కూడా ఈ ఫలితాలతో ఎగిరిపోయింది.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications