Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాష్ట్రం విడిపోక తప్పదా?

Andhra pradesh
సీమాంధ్రులు ఎంతగా వ్యతిరేకిస్తున్నప్పటికీ రాష్ట్ర విభజన తప్పదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పరిస్థితులు విభజన వైపు సాగుతున్నట్లు అనిపిస్తోంది. ఇరు ప్రాంతాల నాయకుల మధ్య విభేదాలు, పరస్పర అసహనాలు పెచ్చరిల్లుతున్నాయి. తెలంగాణలో చెలరేగుతున్న ఆందోళనలు విభజన దిశగా సాగుతున్నట్లు అనిపించక మానవు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక అందేలోగానే పరిస్థితి ఇలా ఉంటే, శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఎలా ఉంటుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లోనూ డిసెంబర్ ఫీవర్ పట్టుకుంది. పారిశ్రామికవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులకు ఢోకా ఉండదని ముఖ్యమంత్రి కె. రోశయ్య హామీలు ఇస్తున్నప్పటికీ ఆ ఆందోళనలు తగ్గడం లేదు. సీమాంధ్ర నాయకుల్లో నెలకొన్న ఆందోళన ఇప్పుడు ప్రజల్లోకి కూడా పాకే ప్రమాదం ఏర్పడింది.

నవంబర్ 1వ తేదీ రాష్ట్రావతరణ దినోత్సవాల తీరు ఇరు ప్రాంతాల మధ్య సయోధ్య సాధ్యం కాదనే విషయాన్ని చాటుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర విభజన ఎలా జరగాలనే చర్చ కూడా ప్రారంభమైంది. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలా, ఉమ్మడి రాజధానిగా చేయాలా అనే ఆలోచనలు కూడా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చెలరేగుతున్న ఊహాగానాలు కూడా పరిస్థితిని విషమింపజేస్తున్నాయి.

నవంబర్ 1వ తేదీన సీమాంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాన్ని బట్టి చూస్తే ఇరు ప్రాంతాల ప్రజల మధ్య కూడా అనుమానాలు, భయాందోళనలు, విద్వేషాలు తలెత్తే ప్రమాదం ఏర్పడిందని అర్థమవుతుంది. భౌగోళికంగా కలిసి ఉంచినా ఇరు ప్రాంతాల ప్రజలు, నాయకుల మధ్య మనసులను కలపలేని వాతారవరణం ఏర్పడింది. అన్ని విషయాల్లోనూ వివాదాలు చెలరేగుతున్నాయి. ఒక్క అంశమని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఎప్పుడు ఏ వివాదం చెలరేగి తెలంగాణలో ప్రజలు వీధుల్లోకి వస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఈ ఆందోళనలు కూడా కట్టడి చేయలేని స్థితికి ప్రభుత్వం చేరుకుంది. అన్ని పార్టీల నాయకులు ఆ ఆందోళనలకు మద్దతు తెలియజేయాల్సిన అనివార్యతలో పడడం వల్ల కట్టడి చేయడం ప్రభుత్వానికి అంత సులభం కాదు.

తెలంగాణకు చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులను కట్టడి చేసి, బలప్రయోగం చేస్తే తప్ప పరిస్థితిని అదుపులోకి తేలేని స్థితి ఏర్పడింది. ఆలా చేయడం వల్ల ఏ రాజకీయ పార్టీ ఏ మేరకు నష్టపోతుంది, ఏ రాజకీయ పార్టీ ఏ మేరకు లాభం పొందుతుందనేది కూడా ప్రధాన విషయంగా మారింది. తమకు నష్టం జరిగే పనిని అధికార కాంగ్రెసు పార్టీ చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే తెలంగాణ నాయకుల మనుగడ ఆధారపడి ఉంది. దీంతో తప్పనిసరిగా ఆందోళనలకు మద్దతు పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఎంత బలమైన నాయకుడు వచ్చినా పరిస్థితిని చక్కదిద్దడం సులభం కాదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+