మందకృష్ణ మాదిగ తెరాస అధినేత కెసిఆర్ కు దగ్గరవుతున్నాడా

ఇటీవల ప్రజా గాయకుడు గద్దర్ పెట్టిన ప్రజా ఫ్రంట్ ను కూడా సమర్థించాడు. గద్దర్ కూడా ఉద్యమాన్ని నీరుగార్చడానికే ఫ్రంట్ ను నెలకొల్పినట్టు పలువురు భావిస్తున్నారు. కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉధ్యమం భారీ స్థాయిలో ఉవ్వెత్తున ఎగుస్తున్నప్పుడు ఫ్రంట్ పెట్టాల్సిన అవసరం ఏమిటని పలువురు ప్రశ్నించారు. ఆ ఫ్రంట్ ను సమర్థించిన మందకృష్ణ ఫ్రంట్ తో కలిసి ఎన్నికలలోకి వెళ్లాలనుకున్నాడు. కాని ఫ్రంట్ ఎన్నికలకు దూరం అని ప్రకటించారు. అయితే మందకృష్ణ అనుకోనివిధంగా మంగళవారం కెసిఆర్ తో భేటీ కావటం, డిసెంబర్ 4న నిర్వహించే మాదిగల యుద్ధభేరీకి కెసిఆర్ ను ఆహ్వనించడం వెనుక తెరాసకు దగ్గరవ్వాలనే ఆయన ఆలోచనను తెలియజేస్తుంది.












Click it and Unblock the Notifications