రాహుల్ తో ఆకుల విక్రం లింక్?

2004లో విక్రం ఆకుల వ్యాపారంలో దెబ్బ తిని తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డారు. అదే సమయంలో భార్య విడాకులు తీసుకుంది. ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వచ్చిందనేది సమాచారం. ఆ సమయంలోనే పేదలను, మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా ఎంచుకుని మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఏర్పాటు చేయాలనే ఆలోచన విక్రం ఆకులకు వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఎస్కెఎస్ మైక్రో ఫైనాన్స్ ను స్థాపించారు. మావోయిస్టుల హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ సంస్థను నడిపించాడు. ఈ క్రమంలో తాను పేదలకు సాయం చేస్తున్నానని చెప్పుకుని విక్రం ఆకుల రాహుల్ గాంధీతో సంబంధాలను ఏర్పరచుకున్నట్లు తెలుస్తోంది.
రాహుల్ గాంధీ మైక్రో ఫైనాన్స్ సంస్థలపై అధ్యయనం మాత్రమే చేశారని, వాటితో రాహుల్ కు సంబంధం లేదని కాంగ్రెసు నాయకులు, మంత్రులు చెబుతూ వస్తున్నారు. రాహుల్ కు సంబంధం ఉందని వచ్చిన విమర్శలపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ భగ్గుమన్నారు. వ్యవహారంలోకి రాహుల్ గాంధీని లాగడంతో రోశయ్య ప్రభుత్వం హుటాహుటిగా కదిలి ఆర్డినెన్స్ ను జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ జారీతో ఆకుల విక్రం ఎస్కెఎస్ షేర్ వాల్యూ 9 శాతనికి పడిపోయింది.












Click it and Unblock the Notifications