జగన్ వెంట అప్పుడు 150 మంది, ఇప్పుడు 19

ఈ ఏడాది ఆగస్టులో జగన్ వర్గానికి చెందిన 26 మంది శానససభ్యులు రాజీనామాలు చేశారు. అప్పుడు ఆయన వెంట మొత్తం 29 మంది శానససభ్యులున్నారు. వారిలో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి, ఒకర ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు కాగా, 26 మంది కాంగ్రెసు సభ్యులు. వారిలో తెలుగుదేశం పార్టీకి చెందిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. కాంగ్రెసు సభ్యులు దాదాపు పది మంది వెనక్కి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ శానససభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన నేపథ్యంలో జగన్ వెంట విజయమ్మతో కలిపి 19 మంది శాసనసభ్యులు మిగిలారు.
అంత మంది తన వైపు నిలబడినందుకు తనకు గర్వంగా ఉందని జగన్ అన్నారు. గతంలో తన దయాదాక్షిణ్యాల మీదనే ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని, తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. కానీ, అది జరగలేదు. అయితే, ఆరు నెలల క్రితం తెలుగుదేశం అవిశ్వాసం ప్రతిపాదించి ఉంటే ప్రభుత్వం పడిపోయి ఉండేదని తెలుగుదేశం అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన నేపథ్యంలో అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు - జగన్పై తీవ్రంగా ధ్వజమెత్తారు. తన వర్గం శానససభ్యులను పది మందిని జగన్ కాంగ్రెసు వైపు పంపించారని, గతంలో ప్రభుత్వాన్ని కూలుస్తానని జగన్ ప్రగల్భాలు పలికారని అన్నారు.
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications