జగన్ వెంట అప్పుడు 150 మంది, ఇప్పుడు 19

ఈ ఏడాది ఆగస్టులో జగన్ వర్గానికి చెందిన 26 మంది శానససభ్యులు రాజీనామాలు చేశారు. అప్పుడు ఆయన వెంట మొత్తం 29 మంది శానససభ్యులున్నారు. వారిలో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి, ఒకర ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు కాగా, 26 మంది కాంగ్రెసు సభ్యులు. వారిలో తెలుగుదేశం పార్టీకి చెందిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. కాంగ్రెసు సభ్యులు దాదాపు పది మంది వెనక్కి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ శానససభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన నేపథ్యంలో జగన్ వెంట విజయమ్మతో కలిపి 19 మంది శాసనసభ్యులు మిగిలారు.
అంత మంది తన వైపు నిలబడినందుకు తనకు గర్వంగా ఉందని జగన్ అన్నారు. గతంలో తన దయాదాక్షిణ్యాల మీదనే ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని, తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. కానీ, అది జరగలేదు. అయితే, ఆరు నెలల క్రితం తెలుగుదేశం అవిశ్వాసం ప్రతిపాదించి ఉంటే ప్రభుత్వం పడిపోయి ఉండేదని తెలుగుదేశం అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన నేపథ్యంలో అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు - జగన్పై తీవ్రంగా ధ్వజమెత్తారు. తన వర్గం శానససభ్యులను పది మందిని జగన్ కాంగ్రెసు వైపు పంపించారని, గతంలో ప్రభుత్వాన్ని కూలుస్తానని జగన్ ప్రగల్భాలు పలికారని అన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications