పార్టీ నాయకత్వంపై స్పష్టత ఇచ్చిన బాలకృష్ణ

గతంలోనే తాను పోటీలో లేనని బాలయ్య చెప్పినప్పటికీ, రాజకీయ ఆరంగేట్ర ప్రకటన అనంతరం మాత్రం అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అంతేకాకుండా అసెంబ్లీకే పోటీ అని చెప్పారు. దీంతో టిడిపి వర్గాల్లో సంశయాలు, బాలయ్య అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లువిరిశాయన్న వాదనలు వినిపించాయి. ఐతే ఆదివారం విశాఖ పర్యటనలో మాత్రం ఆయన పార్టీ నాయకత్వంపై స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తూ తాను పార్టీలో కొనసాగుతానని, తమ కుటుంబంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెప్పారు. దీంతో ఇన్నాళ్ల సస్పెన్స్కు తెరపడినట్లేనని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications