గాలి బళ్లారి రాజు: అలిఖాన్ సామంతరాజు

సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ ప్రకారం - బళ్లారి ప్రాంతంలో ఎవరు లీజులు పొందాలన్నా గాలి జనార్దన్ రెడ్డి అనుమతి పొందాల్సిందేనట. ఇతర లీజు కంపెనీలతో బలవంతపు ఒప్పందాలు, ఆక్రమణలు గాలి జనార్దన్ రెడ్డి నేతృత్వంలో యధేచ్ఛగా సాగాయి. అక్రమ మైనింగ్ కార్యకలాపాల్లో అలీఖాన్ సహాధ్యాయులు మధుకుమార్ వర్మ, సి. శ్రీకాంత్, వి. చంద్రశేఖర రావు భాగస్వాములుగా ఉన్నారు.
అలీఖాన్కు యాక్సిస్ బ్యాంకులో మూడు ఖాతాలు, శ్రీకాంత్, చంద్రశేఖర్, మధు కుమార్ వర్మలతో పాటు అలీఖాన్ తండ్రి కె. ఇక్బాల్కు కూడా ఖాతాలున్నాయి. థర్డ్ ఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఐదు కోట్ల రూపాయలు అలీఖాన్ ఖాతాలోకి బదిలీ అయ్యాయని, ఆ మొత్తాన్ని తనకే చెందిన మరో ఖాతాలోకి, అక్కడి నుంచి పిఓలు, డిడీల ద్వారా మళ్లించి జిపిఎగా బెంగుళూర్ విమానాశ్రంయ వద్ద భూమి కొనుగోలుకు ఖర్చు పెట్టారని సిబిఐ తన అభియోగ పత్రంలో వివరించింది.
దేవి ఎంటర్ప్రైజెస్ కార్యాలయం ఆవరణలోని మధుశ్రీ ఎంటర్ప్రైజెస్ కూడా అలీఖాన్ సన్నిహితులదేనని, వారికి ఐదు కోట్ల రూపాయల చొప్పున రాగా వాటిని ఇతర ఖాతాల ద్వారా భూమి కొనుగోలుకు వినియోగించారని చెప్పింది.
కంప్లి శాసనసభ్యుడు టిహెచ్ సురేష్ బాబు ద్వారా అలీఖాన్ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రాహ్మణి ఇండస్ట్రీస్లో 2007లో చేరారని, 2009లో రాజీనామా చేసి చంద్రశేఖర్తో కలిసి దేవి ఎంటర్ప్రైజెస్ను ఏర్పాటు చేశారని సిబిఐ తెలిపింది. అలీఖాన్ జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడినని చెప్పుకున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని సిబిఐ తెలిపింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications