వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క టిక్కెట్‌తో ఇద్దరికి ఎర: జగన్ పార్టీ నేత చక్రం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pilli Subhash Chandrabose
ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేసి పార్టీలోకి వచ్చిన ఆదిరెడ్డి అప్పారావుకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చింది. అప్పారావు సతీమణి వీర రాఘవమ్మ గతంలో టిడిపి రాజమండ్రి మేయర్‌గా పని చేశారు. అప్పారావుకు స్థానికంగా పట్టు ఉంది.

దీంతో ఆయనను వైయస్సార్ కాంగ్రెసులోకి తీసుకు వచ్చేందుకు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు చక్రం తిప్పారట. అందుకోసం ఆయన పెద్ద మంత్రాంగమే నడిపారు. రాజమండ్రి టిక్కెట్ ఇస్తాననే హామీతో అప్పారావును అప్పుడు పార్టీలోకి తీసుకు వచ్చారట. ఇప్పుడు అదే రాజమండ్రి స్థానంలో బిసి సామాజిక వర్గానికి చెందిన రాజ్ కుమార్ పోటీకి సిద్ధమయ్యారట. ఈ కారణంగానే అప్పారావును నచ్చజెప్పిన పార్టీ పెద్దలు ఎమ్మెల్సీ టిక్కెట్‌కు ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు.

మరో విషయమేమంటే అదే రాజమండ్రి టిక్కెట్ ఇస్తామని చెప్పి పిల్లి సుభాష్ చంద్రబోసు టిడిపికి చెందిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావును ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి తీసుకు వచ్చారట. రాజమండ్రి టిక్కెట్ ఇప్పిస్తామని చెప్పి గతంలో అప్పారావును.. ఇప్పుడు భాస్కర రామారావును సుభాష్ చంద్రబోసు తీసుకు వచ్చారని స్థానికంగా చెవులు కొరుక్కుంటున్నారు. అయితే, రాజ్ కుమార్ అభ్యర్థిగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థిగా అప్పారావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన అనంతరం పలువురు ఎమ్మెల్యేలు ఆయనను వెంట పెట్టుకొని వచ్చి పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలిశారు. పిల్లి సుభాష్ చంద్రబోసుతో పాటు ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, బాబురావు, సుచరిత, సుజయ కృష్ణ రంగారావులు విజయమ్మను బుధవారం కలుసుకున్నారు.

English summary
Adireddy Appa Rao, a prominent backward class leader from Rajahmundry, would be the MLC candidate for YSR Congress, the party announced on Wednesday, while the scene for the Congress nominations shifts to Delhi. Appa Rao would file his nomination on March 8.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X