వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరుగురు సౌత్ సిఎంలతో నటించిన మేటి నటి(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఐదు భాషల్లో 274 చిత్రాల్లో నటించి మెప్పించిన అలనాటి మేటి నటి రాజ సులోచన ఆరుగురు ముఖ్యమంత్రులతో నటించారు. రాజ సులోచన మంగళవారం ఉదయం చెన్నైలోను స్వగృహంలో తుది శ్వాస విడిచారు. తెలుగులో దాదాపు 130 చిత్రాల్లో నటించారు. రాజ సులోచన ఆరుగులు ముఖ్యమంత్రులతో నటించిన ఘనత దక్కించుకున్నారు. అన్నాదురై, కరుణానిధి, నందమూరి తారక రామారావు, విఎన్ జానకి, ఎంజి రామచంద్రన్, జయలలిత వంటి ఆరుగురు ముఖ్యమంత్రులతో కలిసి స్క్రీన్ పంచుకున్నారు.

రాజ సులోచన భర్త ప్రముఖ దర్శకుడు సిఎస్ రావు. ప్రముఖ దర్శకులు సి పుల్లయ్య కోడలు. ఈమె 15 ఆగస్ట్ 1935లో బెజవాడలో జన్మించారు. రాజ సులోచన, సిఎస్ రావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు దేవి, శ్రీ, ఓ కుమారుడు శ్యామ్ ఉన్నారు. రాజ సులోచన పూర్తి పేరు పిళ్లయార్‌చెట్టి భక్తవత్సలం నాయుడు రాజీవలోచన. రైల్వేలో పనిచేసే తండ్రి భక్తవత్సలం నాయుడు ఉద్యోగరీత్యా చిన్ననాడే మద్రాసుకు వచ్చారు.

6గురు సిఎంలతో నటించిన మేటి నటి(పిక్చర్స్)

ఓ సినిమాలో రాజ సులోచన. ఆరుగురు ముఖ్యమంత్రులతో కలిసి ఆమె నటించారు!

6గురు సిఎంలతో నటించిన మేటి నటి(పిక్చర్స్)

జయలలిత

6గురు సిఎంలతో నటించిన మేటి నటి(పిక్చర్స్)

నందమూరి తారక రామారావు

6గురు సిఎంలతో నటించిన మేటి నటి(పిక్చర్స్)

అన్నాదురై

6గురు సిఎంలతో నటించిన మేటి నటి(పిక్చర్స్)

కరుణానిధి

6గురు సిఎంలతో నటించిన మేటి నటి(పిక్చర్స్)

ఎంజి రామచంద్రన్

6గురు సిఎంలతో నటించిన మేటి నటి(పిక్చర్స్)

జానకి రామచంద్రన్

చిన్నతనంలోనే నృత్యంపై రాజ సులోచన మక్కువ పెంచుకున్నారు. భరతనాట్య నేర్చుకున్నారు. కూచిపూడి పితామహుడు వెంపటి చినసత్యం వద్ద కొంతకాలం శిష్యరికం చేశారు. మంచి నృత్య కళాకారిణిగా పేరు రావడంతో 1953లో కన్నడ చిత్రం గుణసాగరితో తెరంగేట్రం చేశారు.

అదే సమయంలో తెలుగులో కన్నతల్లి చిత్రంలో అతిథి పాత్ర అవకాశం వచ్చింది. సొంత ఊరుతో కథానాయికగా మారి ఎన్టీఆర్, అక్కినేని, శివాజీగణేశన్ తదితర అగ్ర హీరోల సరసన నటించారు. 1960ల్లో చెన్నైలో 'పుష్పాంజలి' పేరిట నృత్య అకాడమీని స్థాపించారు. రాజ సులోచనతో 27కు పైగా సినిమాల్లో నటించినట్టు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుర్తు చేసుకున్నారు.

English summary
Raja sulochana is the only actress who has acted with six Chief Ministers of the southern states: Annadurai, Karunanidhi, N.T. Rama Rao, V.N. Janaki, M.G. Ramachandran and Jayalalithaa, reveals veteran journalist Major Dasan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X