నాడు మొహంపై కొట్టి.. నేడు స్వాగతం (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ శాసన సభ ఆవరణలో బుధవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ ముఖంపై పేపర్లు విసిరేసిన చేతులతోనే హరీష్ రావు గవర్నర్ నరసింహన్కు పుష్పగుఛ్ఛం ఇచ్చారు. కెసిఆర్, హరీష్ రావులు ఆయనకు స్వాగతం పలికారు. బుధవారం ఉదయం పదకొండు గంటలకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. ఆయన ఐదు నిమిషాల ముందే అసెంబ్లీ ఆవరణకు వచ్చారు.
సిఎం కెసిఆర్, సభాపతి మధుసుదనాచారి, మంత్రులు నరసింహన్కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతించారు. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ ప్రసంగం ప్రతులను నాడు ఎమ్మెల్యేలుగా ఉన్న తెరాస నేతలు చించివేసి, ఆయన ముఖంపై విసిరేశారు. ఇప్పుడు సాదరంగా స్వాగతం పలికారు.
కాగా, గవర్నర్ బుధవారం ప్రసంగిస్తున్న సమయంలో తెలుగుదేశం, కాంగ్రెసు సభ్యులు అడ్డు తగిలారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు ఆయన ప్రసంగానికి అడ్డు తగులుతూ... ప్రసంగానికి కౌంటర్గా కేకలు వేశారు.
పుష్పగుచ్ఛం
ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ నరసింహన్కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు.
గవర్నర్
ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ నరసింహన్కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న సభాపతి మధుసూదనాచారి.
హరీష్ రావు
ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ నరసింహన్కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న కెసిఆర్, హరీష్ రావులు.
అసెంబ్లీ
గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో వింటున్న తెలంగాణ అసెంబ్లీలోని వివిధ పార్టీల సభ్యులు.
అసెంబ్లీ
గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో వింటున్న తెలంగాణ అసెంబ్లీలోని వివిధ పార్టీల సభ్యులు.
అసెంబ్లీ
గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో వింటున్న తెలంగాణ అసెంబ్లీలోని వివిధ పార్టీల సభ్యులు. జానా, డిఎస్ తదితరులు.
గవర్నర్
గవర్నర్ ఈఎస్ఎల్ఎన్ నరసింహన్ బుధవారం మధ్యాహ్నం పదకొండు గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి తెలంగాణ అసెంబ్లీలో ప్రసంగించారు.
మంత్రులు
గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో వింటున్న తెలంగాణ అసెంబ్లీలోని మంత్రులు, ఇతర సభ్యులు.
కెసిఆర్
గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో తెలంగాణ అసెంబ్లీలో వింటున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.
కొండా సురేఖ
గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో తెలంగాణ అసెంబ్లీలో వింటున్న మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కొండా సురేఖ.
డికె అరుణ
గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో తెలంగాణ అసెంబ్లీలో వింటున్న మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే డికె అరుణ.